సీఎం జగన్ చారిత్రక ముందడుగు.. అక్టోబర్ 1న ప్రారంభం

cm jagan to reopen bapu museum in vijayawada

సీఎం జగన్ మరో చారిత్రక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎప్పటి నుంచో అభివృద్ధికి నోచుకోకుండా.. మూతపడి ఉన్న బాపు మ్యూజియాన్ని అక్టోబర్ 1 న పున:ప్రారంభం చేయనున్నారు.

cm jagan to reopen bapu museum in vijayawada
cm jagan to reopen bapu museum in vijayawada

విజయవాడ బందరు రోడ్డులో ఉన్న బాపు మ్యూజియం గత ప్రభుత్వ పాలనలో మూతపడిపోయింది. దాని అభివృద్ధిని గత పాలకులు పట్టించుకోకపోయినా.. సీఎం జగన్.. దాన్ని మళ్లీ అభివృద్ధి చేయించారు. 8 కోట్ల రూపాయలతో ఆ మ్యూజియాన్ని ఆధునీకరించారు. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి మ్యూజియాన్ని అభివృద్ధి చేశారు.

ఈ మ్యూజియం ద్వారా అందరికీ ఎంతో ఙ్ఞానం లభిస్తుందని.. కొత్తగా ఆధునీకరించిన మ్యూజియంలో ఆదిమ యుగం నుంచి ఆధునిక యుగం వరకు వాడిన 1500 వస్తువులను ఈ మ్యూజియంలో ప్రదర్శిస్తామని.. పురావస్తుశాఖ కమిషనర్ వాణిమోహన్ స్పష్టం చేశారు.

అయితే.. దేశంలోనే ఏ మ్యూజియంలో లేనటువంటి టెక్నాలజీని ఈ మ్యూజియంలో ఉపయోగించారు. స్మార్ట్ ఫోన్ లో ఓ యాప్ ఆధారంగా మ్యూజియంలో ప్రదర్శింపబడుతున్న వస్తువుల చరిత్రను తెలుసుకునేలా మ్యూజియం నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఇక.. ఈ మ్యూజియాన్ని సీఎం జగన్.. అక్టోబర్ 1న ప్రారంభించనున్నారు.