Ys Jagan Convoy : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒంగోలులో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన కోసం అధికారులు భారీ ఏర్పాట్లు చేయడం అనేది సర్వసాధారణం. ఎవరు అధికారంలో వున్నా ప్రోటోకాల్ కోసం, ప్రోటోకాల్ని మించి ఏర్పాట్ల నిమిత్తం అధికారుల హైరానా తప్పనిసరి.
ఈ క్రమంలో కొందరు అధికారులు అత్యుత్సాహం చూపడం కూడా మామూలే. అధికార పార్టీకి చెందిన స్థానిక నేతలు, ప్రజా ప్రతినిథులు, కీలక పదవుల్లో వున్న నాయకులు.. అధికారుల మీద తెచ్చే ఒత్తిడి ఓ రేంజ్లో వుంటుంది. ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడాల్లేవు.. ఎవరు అధికారంలో వున్నా ఇదే తంతు.
అయితే, దైవదర్శనం కోసం వెళుతున్న ఓ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి, వారు ప్రయాణిస్తున్న కారుని అధికారులు లాక్కోవడం, లాక్కున్నాక.. దాన్ని సీఎం కాన్వాయ్ కోసం వినియోగిస్తామని చెప్పడం మాత్రం చరిత్రలో ఇప్పటివరకూ ఎప్పుడూ ఎవరూ చూడని వింత.
ఆర్టీయే అధికారులు ఈ ‘ఘాతుకానికి’ పాల్పడ్డారట. విషయం సీఎం దృష్టికి వెళ్ళింది. తక్షణం దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిందిగా పై నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ క్రమంలో ఓ హోంగార్డ్ (కానిస్టేబుల్ అని కూడా అంటున్నారు), ఓ ఎస్ఐని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారట.
కానీ, ఇక్కడ సస్పెండ్ చేయాల్సింది ఎవర్ని.? ఈ మొత్తం దారుణానికి బాధ్యత వహించాల్సిందెవరు.? ఎప్పుడూ ఉన్నతాధికారులు, కీలక పదవుల్లో వున్న అధికార పార్టీ నాయకులు సేఫ్ అవుతారు. సాధారణ ఉద్యోగులే బలైపోతుంటారు. ఇక్కడా అదే జరిగింది.
కారు అవసరమైందని, దాన్ని తీసుకెళ్ళారు సరే.. అమ్మాయి అవసరమైందని ఇంట్లోకి చొరబడి ఆ పని చేస్తారా.? అని ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రశ్నించడాన్ని ఎలా తప్పుపట్టగలం.?
