Bheemla Nayak Pre Release Guest : గాడ్ ఆఫ్ మాసెస్ పవన్ కళ్యాణ్ హీరోగా రానా దగ్గుబాటి మరో ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా “భీమ్లా నాయక్” సినిమా కోసం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ పెద్ద ఎత్తున వినిపిస్తుంది. సడెన్ గా ఈ నెలలోనే రిలీజ్ అనే సరికి అన్ని పనులు ఓ రేంజ్ లో వెళ్తున్నాయి.
ఇక దీనితో పాటుగా గత కొన్నాళ్ల నుంచి పవన్ సినిమాలు ఏ స్పెషల్ గెస్టులు కూడా లేకుండానే కానిచేస్తున్న సంగతి చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు కూడా భీమ్లా నాయక్ కి అలానే చేస్తారేమో అని అనుకోగా కొందరి బిగ్ స్టార్ హీరోలు పేర్లు వినిపించాయి. కానీ వాళ్ళెవరు రావట్లేదని ముందు కన్ఫర్మ్ అయ్యింది.
కానీ ఇప్పుడు మరో కీలక ముఖ్య అతిథి ని చిత్ర బృందం ఆహ్వానించినట్టుగా ఇప్పుడు బ్రేకింగ్ అప్డేట్ తో కన్ఫర్మ్ అయ్యింది. ఈ ఈవెంట్ కి గెస్ట్ తెలంగాణా రాష్ట్ర పారిశ్రామిక మంత్రి కేటీఆర్ ని పిలిచినట్టుగా కన్ఫర్మ్ చేశారు. సో ఈ సినిమాకి కేటీఆర్ మాత్రమే ముఖ్య అతిధిగా గ్రేస్ చేయనున్నారని కన్ఫర్మ్ అయ్యింది.
ఇక ఈ చిత్రంలో నిత్య మీనన్ మరియు సంయుక్త మీనన్ లు హీరోయిన్స్ గా నటించగా త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మాణం వహించగా థమన్ సంగీతం ఇచ్చాడు.
Extremely grateful to our Dynamic leader @KTRTRS garu for obliging our request to grace the Massive Pre-Release event of #BheemlaNayak on 21st Feb💥🤩#BheemlaNayakOn25thFeb @pawankalyan @RanaDaggubati #Trivikram @saagar_chandrak @MenenNithya @MusicThaman @iamsamyuktha_ @dop007 pic.twitter.com/Z5s792pMZd
— Naga Vamsi (@vamsi84) February 19, 2022
