Prakash Raj: పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ విమర్శలు… మూసుకోవాలంటూ కౌంటర్ ఇచ్చిన బీజేపీ!

Prakash Raj: సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఇటీవల కాలంలో రాజకీయాల పరంగా కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తూ పెద్ద ఎత్తున వివాదాలలో నిలుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈయన గత కొద్ది కాలంగా తన సహనటుడు మిత్రుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తూ వచ్చారు.. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్న ప్రతిసారి ప్రకాష్ రాజ్ విమర్శలు కురిపిస్తూనే వచ్చారు.

ఇక ఇటీవల బీజేపీ వ్యవహారంపై విమర్శలు చేసిన ప్రకాశ రాజ్ బీజెపితో పవన్ కళ్యాణ్ కలిసి ప్రయాణం చేయటానికి కూడా తప్పుపట్టారు పవన్ కళ్యాణ్ బిజెపితో ప్రయాణం చేయడం అంటే ముంబై లోకల్ ట్రైన్ లో ప్రయాణం చేయడం లాంటిదేనని తెలిపారు. ఇలా లోకల్ ట్రైన్ లోకి పవన్ కళ్యాణ్ ను బిజెపి ఎక్కించిందని ఎప్పుడో ఒకసారి వాళ్లే దించేస్తారని ఈ విషయం పవన్ కళ్యాణ్ గుర్తించాలని హితబోధ చేశారు.

బిజెపి తమ స్వార్థ రాజకీయాల కోసం నిన్ను వాడుకుంటుందని ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తిస్తే బాగుంటుందని తెలిపారు. ఇలా పవన్ కళ్యాణ్ బిజెపితో ప్రయాణం చేయటాన్ని లోకల్ ట్రైన్ జర్నీ అంటూ ఈయన మాట్లాడటంతో జనసైనికులు బిజెపి నేతలు స్పందిస్తూ ప్రకాష్ రాజ్ కు కౌంటర్ ఇస్తున్నారు.పవన్ కళ్యాణ్ గురించి బీజేపీ గురించి ప్రకాష్ రాజు చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీ సీనియర్ నేత హర్షవర్ధన్ రెడ్డి స్పందించారు.బీజేపీపై నిత్యం విమర్శలు చేయడమే మీ పని.. పవన్ కళ్యాణ్‌పై విమర్శలతో వార్తల్లో నిలవడం తప్ప, నిజంగా మీరు ఏం సాధించారు అని ప్రకాశ్‌రాజ్‌ను నిలదీశారు.

పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వచ్చి జనసేన పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా ప్రస్తుతం మంత్రిగాను డిప్యూటీ సీఎం గా కూడా బాధ్యతలు తీసుకున్నారు. మరి మీరు ఎన్నికలలో పోటీ చేసి ఓటమిపాలు అయ్యారు.జనసేన పార్టీకి బీజేపీ అండగా ఉంటుందని, మీరు ప్రశాంతంగా ఉండాలంటూ విష్ణువర్ధన్ రెడ్డి ఘాటుగా బదులిచ్చారు. ఒక రకంగా విష్ణువర్ధన్ రెడ్డి ప్రకాష్ రాజ్ కు కౌంటర్ ఇస్తూ ఓడిపోయిన వాళ్ళు మాట్లాడటానికి వీలులేదని సైలెంట్ గా అన్ని మూసుకొని కూర్చోవాలి అనే విధంగానే ఆయనకు కౌంటర్ ఇచ్చారు.