Chandrababu and Ys Jagan : చంద్రబాబుకీ వైఎస్ జగన్‌కీ మధ్య పెద్ద తేడా అదే.!

Chandrababu and Ys Jagan : 2019 ఎన్నికలకు ముందు అప్పటి ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, అసెంబ్లీ సమావేశాల్ని బహిష్కరించిన సంగతి తెలిసిందే. పాదయాత్ర నిమిత్తం అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టి, చంద్రబాబు ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు నిరసనగానే అసెంబ్లీ సమావేశాల్ని బహిష్కరించినట్లు చెప్పుకుంది వైసీపీ.
సరే, ఏ రాజకీయ పార్టీకి ఎలాంటి వ్యూహాలుంటాయో అది ఆయా పార్టీలకు సంబంధించిన అంశం. తన సతీమణిని అసెంబ్లీ సాక్షిగా అవమానించారని ఆరోపిస్తూ ప్రస్తుత ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్ని బహిష్కరించారు.
చిత్రమేంటంటే, చంద్రబాబు మాత్రమే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంలేదు. టీడీపీ శాసన సభ్యులంతా సమావేశాలకు హాజరవుతున్నారు. ఎమ్మెల్సీలూ అంతే. ఇదెక్కడి వింత నిరసన.? అంటూ జనం ముక్కున వేలేసుకుంటున్నారు.
తాజాగా ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో చంద్రబాబు అసెంబ్లీ సమావేశాల్ని బాయ్‌కాట్ చేయడంపై ఆసక్తికరమైన ‘వాదన’ ఇరు పక్షాల మధ్యా జరిగింది. ఈ క్రమంలో అధికార పక్షం సంధించిన ప్రశ్నలకు ప్రతిపక్షం సమాధానం చెప్పుకోలేకపోయింది.
‘గతంలో మేం కూడా అసెంబ్లీ సమావేశాల్ని బహిష్కరించాం. మా నాయకుడి మీద మాకున్న నమ్మకం అది. అందుకే, 151 మంది ఎమ్మెల్యేలతో అధికారంలోకి వచ్చాం.. కానీ, మీకు మీ నాయకుడి మీద నమ్మకం లేదు..’ అంటూ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, టీడీపీని విమర్శించారు. ‘మీ నాయకుడి మీద మీకు నమ్మకం వుంటే, ఆయన మాట మీద మీకు గౌరవం వుడి వుంటే.. ఆయన బాటలో మీరూ సభకు వచ్చి వుండేవారు కాదు..’ అన్నది అనిల్ కుమార్ యాదవ్ వాదన.
ఈ లాజిక్ ఏదో బాగానే వుంది కదూ.! ఔను, అదే తేడా చంద్రబాబుకీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికీ. మామూలు తేడా కాదు, చాలా పెద్ద తేడా.