తెలుగు సినిమా ఇండస్ట్రీ టాప్ హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్ దగ్గరలో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని ఒక మహిళ దారుణంగా హత్య గావించబడింది. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం జన్వాడ శివారులో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. వారం రోజుల కిందటే ఈ ఘటన జరిగి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు.
స్థానికులు అందించిన సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్నారు పోలీసులు. దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్టు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించినట్టు తెలుస్తోంది. ఆ మహిళ ఆచూకీ ఇంకా తెలియరాలేదు. విచారణ చేపట్టిన పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
పవన్ ఫామ్ హౌస్ దగ్గర హత్య చేయబడ్డ మహిళ ఎవరు? ఆమె ఏ ప్రాంతానికి చెందిన మహిళ? ఆమెను హత్య చేయాల్సిన అవసరం ఎవరికీ ఉంది? ఆమ్మెను చంపిన వ్యక్తులు ఎవరు? అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా పవన్ ఫామ్ హౌస్ దగ్గర్లో ఉండే సీసీ టీవీ ఫుటేజీ కూడా అధికారులు పరిశీలించే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. ఆ ఫుటేజీ ఆధారంగా ఏవైనా క్లూలు దొరికే అవకాశం ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.
