వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డిపై ఘాటుగా విమర్శలు చేశారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. చంద్రబాబు ఆరు పెళ్లిళ్లు చేసుకున్నాడు అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు సోమిరెడ్డి. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన జగన్ పై మండిపడ్డారు. ఆయన ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే కింద ఉంది చదవండి.
జగన్ మోహన్ రెడ్డికి పెళ్లిళ్ల యావ ఎక్కువ ఐంది. ఎప్పమైతే ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుంది అని తెలుసుకున్నాడో అప్పటినుండి ఇష్టానుసారం మాట్లాడటం అలవాటు చేసుకున్నాడు. ఇటీవల ఎక్కువగా పెళ్లిళ్ల భాష మాట్లాడుతున్నాడు. ఈమధ్యనే పవన్ కళ్యాణ్ గారిని నువ్వు నాలుగైదు పెళ్లిళ్లు చేసుకున్నావ్, నాలుగు సంవత్సరాలకొకసారి పెళ్లి చేసుకున్నావ్ అని ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశాడు. ఈరోజు టీడీపీ మీద పెళ్ళిళ్ళభాష వాడి చంద్రబాబుగారిని, మమ్మల్ని నైతికంగా దెబ్బతీసే ప్రయత్నం చేశాడు.
నీ స్వార్ధం కోసం నువ్వు ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నావో నీకు లెక్క ఉందా? కేసుల నుండి బయట పడేందుకు ఎవరితోననిన సంసారం చేసేందుకు సిద్ధమయ్యావు. మీ నాయన, నువ్వు ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నారో చెప్పగలవా నువ్వు?
మీ నాయన కాంగ్రెస్ లో ఉన్నప్పుడే 2004 లో కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, టీఆరెస్, సమాజ్ వాదీ పార్టీలను పెళ్లి చేసుకున్నాడు. తమరు చెప్పే పెళ్లిళ్ల భాషలో అక్కడికే 6 పెళ్లిళ్లు పూర్తయ్యాయి. ఇటీవల కాలంలో ఈ పార్టీ నేత వరప్రసాద్ జనసేనతో పెళ్లి ఖాయమని ఖరాఖండిగా చెప్పారు. నీపై ఉన్న కేసులకు భయపడి మోదీతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న సంగతి అందరికీ తెలుసు.
మోదీ, జగన్ మోహన్ రెడ్డి ఇద్దరూ ఒకే గదిలో ఆంతరంగిక సమావేశంలో 45 నిమిషాలపాటు గడిపారు. వారిద్దరి మధ్య ఏ విషయాలు చర్చకు వచ్చాయో, ఏం జరిగిందో ప్రజలకు ఇప్పటికీ తెలియదు. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ మోహన్ రెడ్డికి రాజకీయ పరిజ్ఞానం లేదు. మిస్టర్ జగన్ మోహన్ రెడ్డి, తమరికి కంపెనీల అక్రమ లావాదేవీల్లో పరిజ్ఞానం ఎక్కువ. మీ దురాశ కారణంగా ఉన్నతాధికారులు, పారిశ్రామికవేత్తలు, మీ కుటుంబ సభ్యులతో సహా మానసిక క్షోభకు గురయ్యారు.
సిద్ధాంతం అనేదానికి మీకు నిర్వాకాహణం తెలియదు. నైతిక విలువలు అసలే లేవు. టీడీపీ కి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని గుర్తుంచుకో. నువ్వూ, నీ మీడియా భ్రష్టు రాజకీయాలు మానండి. స్వార్ధం కోసం రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టకండి. ఈవిధంగా సోమిరెడ్డి జగన్ పై ఘాటు విమర్శలతో విరుచుకు పడ్డారు.
