జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రయాణిస్తున్న కాన్వాయ్ లోని వాహనం ప్రమాదానికి గురైంది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో సభలో పాల్గొనడానికి వస్తుండగా వాహన శ్రేణిలో సెక్యూరిటి ప్రయాణిస్తున్న కారు లారీని ఢికొట్టింది. కాకినాడ నుంచి వస్తుండగా రంగంపేట శివారులో ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో ఎనిమిది మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. వీరందరిని రాజానగరంలోని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. అంతా క్షేమంగా ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


