ముఖ్యమంత్రి కావాలని రాజకీయాల్లోకి రాలేదని అలా వచ్చివుంటే జనసేన రూపు రేఖలు మరోలా ఉండేవని జనసేన నేత పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన లేకపోతే, ప్రజల తరఫున మాట్లాడే దిక్కువుండేది కాదని కూడా ఆయన అన్నారు. అన్యాయం జరుగుతూ ఉంటే ఏమీ చేయలేకపోతున్నాననే నిరాశ చాలా కాలంగా ఉండిందని చెబుతూ ఇక లాభం లేదు, రంగంలోకి దూకాలనే వచ్చాను అని ఆయన అన్నారు. ఇపుడు కులాలను వాడుకుని వ్యక్తులు కుటుంబాలు ఎదుగుతున్నాయితప్ప కులాలు అభివృద్ధి చెందడం లేదని జనసేన అధినేత అన్నారు. అన్నిరాజకీయ పార్టీలు బడుగు బలహీన వర్గాల ప్రజలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నాడు హైదరాబాద్ జనసేన పార్టీ కార్యాలయంలో తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా నుంచి అనేక మంది నాయకులు పార్టీలో చేరారు. వారిలో గిరజాల వేంకట స్వామి నాయుడు, పాకా శ్రీనివాసరావు, మైరెడ్డి గంగాధర రావు, రాయపురెడ్డి చిన్నారెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా పవన్ ప్రసంగించారు. ఆయన ప్రసంగం వీడియో ఇది…

