కమ్మరావతి, భ్రమరావతి.. చంద్రబాబు ఈ కామెంట్ల గురించి స్పందిస్తారా?

YCP MLA and former minister Kodali Nani in assembly meetings మాట్లాడుతూ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మూడు రాజధానుల విషయంలో వ్యక్తమైన విమర్శలకు కొడాలి నాని గట్టి కౌంటర్ ఇచ్చారు. అమరావతి పాదయాత్ర పేరుతో చంద్రబాబు హై డ్రామా ఆడుతున్నారని కొడాలి నాని కామెంట్లు చేయడం గమనార్హం. వైజాగ్ లో కూడా చంద్రబాబు సొంత కులానికి చెందిన వాళ్లే ఎక్కువగా ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు.

అమరావతిని కమ్మరావతి అనుకుంటున్నారని అందువల్లే ఖమ్మంలో కార్పొరేటర్ గా కూడా గెలవలేని రేణుకా చౌదరితో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని కొడాలి నాని చెప్పుకొచ్చారు. అమరావతి రైతులకు ఫ్లాట్స్ ఇవ్వకుండా చంద్రబాబు మోసం చేశారని కొడాలి నాని అన్నారు. జగన్ పై బురద జల్లడమే కొంతమంది పనిగా పెట్టుకున్నారని కొడాలి నాని కామెంట్లు చేశారు. చంద్రబాబు తనకు కావాల్సిన వాళ్లకు కారు చౌకగా భూములు ఇచ్చారని కొడాలి నాని పేర్కొన్నారు.

అమరావతిని భ్రమరావతి చేసింది చంద్రబాబు అని ఆయన కామెంట్లు చేశారు. 50 లక్షల రూపాయలు ఎకరం విలువ ఉంటే చంద్రబాబు రాజధానిని ప్రకటించి ఎకరం 5 కోట్ల రూపాయలు అయ్యేలా చేశారని ఆయన చెప్పుకొచ్చారు. భూములు కొన్నవాళ్లు మాత్రమే అమరావతిని రాజధానిగా కావాలని అంటున్నారని తెలిపారు. అయితే ఈ కామెంట్ల గురించి చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పటి నుంచి రాజధాని విషయంలో ఎన్నో ఆరోపణలు వినిపించాయి. రాజధాని విషయంలో చంద్రబాబు సరైన నిర్ణయం తీసుకోలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. రాజధానిని విమర్శలకు అవకాశం ఇవ్వకుండా చంద్రబాబు ఎంపిక చేసి ఉంటే బాగుండేదని ఇప్పటికే రాజధాని అభివృద్ధి జరిగి ఉండేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.