కేసీయార్ మోచేతి నీళ్ళకోసం ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు.?

సీమాంధ్ర పౌరుషం.! నాడు, నేడు.! తెలంగాణలో ‘ప్రత్యేక రాష్ట్ర సాధన’ అనే లక్ష్యాన్ని నిర్దేశించి, ఆ లక్ష్యం కోసం పోరాడే క్రమంలో నానా రకాల తిట్లూ తిట్టారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత హోదాలో, సీమాంధ్ర నాయకుల్ని, సీమాంధ్ర ప్రజల్నీ.!

ప్రధాన మంత్రినే ‘చప్రాసీ’ అనేసిన ఘనుడు కేసీయార్. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక కూడా, అడపా దడపా కేసీయార్, సీమాంధ్రులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సందర్భాలున్నాయ్. వాటన్నిటినీ చాలామంది సీమాంధ్ర నాయకులు మర్చిపోయారు. కేసీయార్ మోచేతి నీళ్ళ కోసం ఆరాటపడుతున్నారిప్పుడు.

ఒకప్పుడు ఇదే కేసీయార్, తెలంగాణ ప్రాంత నాయకుల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిల్చేందుకు, ‘సీమాంధ్రుల మోచేతి నీళ్ళకి కక్కుర్తి పడతారా.?’ అంటూ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అప్పట్లో సీమాంధ్ర నాయకుల పౌరుషం వేరు.. వారి పరిస్థితి వేరు.!

ఇప్పుడు సీన్ మారింది. ‘కేసీయార్ మోచేతి నీళ్ళు తాగేందుకు ఏపీ నాయకులు’ పోటీ పడుతున్నారు. ఇంతలోనే ఎంత మారింది.? జాతీయ రాజకీయాల్ని శాసించిన ఆనాటి సీమాంధ్ర నాయకులు ఇప్పుడెక్కడ.? చంద్రబాబు ‘ఆడా వుంటా.. ఈడా వుంటా..’ అనకుండా, ఆంధ్రప్రదేశ్‌కి ఆ మాటకొస్తే, అమరావతి పరిధిలో కొన్ని గ్రామాలకు పరిమితమైపోయిన సంగతి తెలిసిందే.

ఇంతకీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిస్థితేంటి.? కేసీయార్ మోచేతి నీళ్ళు తాగేందుకు సిద్ధపడుతున్న నాయకుల విషయంలో వైసీపీ ఎందుకు ఆత్మగౌరవ నినాదాన్ని వినిపించలేకపోతోంది.? ఎవరి గోల వారిది.!