Pawan Kalyan: గిరిజన ఓటు కోసం జనసేన వ్యూహాత్మక దూకుడు!

ఏపీ రాజకీయాల్లో గిరిజన ఓటు బ్యాంక్ ఎప్పుడూ కీలకంగా ఉంటుంది. ఇప్పటివరకు ఈ ఓటు బ్యాంక్‌ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆధిపత్యం ఉన్నప్పటికీ, తాజా పరిణామాలతో ఆ సమీకరణ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 2024 ఎన్నికల్లో జనసేన పార్టీకి తొలిసారి గిరిజన నియోజకవర్గంలో విజయం లభించడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. పోలవరం నియోజకవర్గం నుంచి చిర్రి బాలరాజు విజయం సాధించడంతో జనసేనకు కొత్త ఉత్సాహం లభించింది.

ఈ విజయం కేవలం అపహాసిక విజయంగా కాకుండా, రాజకీయంగా వ్యూహాత్మకంగా ఎలా ఉపయోగించుకోవచ్చో జనసేన ఇప్పటినుంచే లెక్కలు వేసుకుంటోంది. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి లోపాలు, స్థానిక సమస్యలు, నిర్లక్ష్య పాలన.. ఇవన్నీ జనసేనకు అవకాశాలుగా మారాయి. అంతేకాదు, ఈ ప్రాంతాల్లో ప్రజలతో ప్రత్యక్షంగా కలిసే కార్యక్రమాలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించడం గమనార్హం.

ఇటీవల అల్లూరి సీతారామరాజు జిల్లాలో పవన్ చేసిన పర్యటనకు ఈ పరిణామమే ఓ ఉదాహరణ. అక్కడ ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం, ప్రజలతో నేరుగా మమేకమవడం రాజకీయంగా వ్యూహాత్మక అడుగుగా అభివర్ణించబడుతోంది. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి+సెంటిమెంట్ అనే రెండు అంశాలపై జనసేన దృష్టి పెట్టడం, వచ్చే ఎన్నికల్లో మరిన్ని ఎస్టీ నియోజకవర్గాలను లక్ష్యంగా చేసుకోవడమే అన్నది స్పష్టమవుతోంది.

గతంలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యంలో ఉన్న గిరిజన ఓటు, తరువాత వైసీపీకి మళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే ఓటును జనసేన తనవైపు తిప్పుకోవడానికి కార్యాచరణ మొదలుపెట్టడం గమనార్హం. నాలుగేళ్ల సమయం ముందుగా వ్యూహం సిద్ధం చేసుకుని క్రమంగా ప్రజల మద్దతు సంపాదిస్తే, గిరిజన ప్రాంతాల్లో కొత్త రాజకీయ సమీకరణ ఏర్పడే అవకాశం ఉంది. వైసీపీకి ఇప్పటివరకు భరోసా ఇచ్చిన ఓటు బ్యాంకు, జనసేన వైపు మళ్లుతుందా? అనే ప్రశ్నపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ సాగుతోంది.

గురూజీకి షాక్ చ్చిన తమిళ్ హీరో || Dasari Vignan Reacts On Sivakarthikeyan Shocks Trivikram || TR