ఆ మాజీ ఎమ్మెల్యే కూతురికి టికెట్ క‌న్‌ఫ‌ర్మ్‌ చేసిన జగన్

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో చింతపల్లి మాజీ ఎమ్మెల్యే గొడ్డేటి దేముడు కూతురికి టికెట్ క‌న్‌ఫ‌ర్మ్‌ చేసారు జగన్. పాడేరు నుంచి అసెంబ్లీకి లేదంటే అరకు నుంచి లోక్ సభకు టికెట్ ఇస్తానని, చట్టసభలో ప్రశ్నించేందుకు ఆమెకు జగన్ అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు గొడ్డేటి దేముడు కుమార్తె గొడ్డేటి మాధవి.

శనివారం యలమంచిలిలో పాదయాత్ర చేస్తున్న జగన్ ను  తన 14,000 మంది మద్దతు దారులతో పాటు ఆమె కలిశారు.  మద్దతు దారులతో పాటు ఆమె వైసీపీ కండువా కప్పుకుని వైసీపీలో చేరారు. వర్షం కారణంగా అట్టహాసంగా వేలాదిమంది మద్దతుదారుల సమక్షంలో పార్టీలో చేరాలి అనుకున్న ఆమెకు నిరాశ ఎదురైంది. చాలా సింపుల్ గా ఆ కార్యక్రమం ముగిసింది. జగన్ బస్సు ఎక్కి ఆమెకు కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. 

అనంతరం గోకివాడ సమీపంలో తన మద్దతుదారులతోపాటు మాధవి జగన్ తో కలిసి పాదయాత్రలో నడిచారు. జగన్ ఆమెకు వైసీపీ పాడేరు సమన్వయకర్త భాగ్యలక్ష్మిని, అరకు పార్లమెంటరీ నియోజకవర్గం సమానవ్యకర్తను పరిచయం చేశారు. అసెంబ్లీ లేదా లోక్ సభ టికెట్ పై పాదయాత్ర ముగిశాక జగన్ ప్రకటిస్తానని హామీ ఇచ్చినట్లు మాధవి మీడియాతో పంచుకున్నారు.