రోజా రాఖీ కడుతుంటే జగన్ ఎక్స్‌ప్రెష‌న్స్‌ చూడండి (వీడియో)

వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర చేస్తున్నారు. ఈరోజు రాఖీ పండుగ కావడంతో ఆయనతో పార్టీ మహిళా నేతలు, పెద్ద ఎత్తున మహిళా అభిమానులు పాదయాత్రలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా యలమంచిలి నియోజకవర్గం దారా భోగాపురం శివార్లలో ఏర్పాటు చేసిన పాద యాత్ర విడిది శిబిరంలో మహిళా నేతలు జగన్ కి రాఖీ కట్టారు. వైఎస్ జగన్ కు ఎమ్మెల్యే రోజా, వరుదు కళ్యాణి, పద్మజా రెడ్డి తదితరులు రాఖీ కట్టి స్వీట్ తినిపించి రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. జగన్ వారికి రాఖీ శుభాకాంక్షలు తెలిపి, ఆశీర్వదించారు. రోజా రాఖీ కడుతున్న సమయంలో జగన్ చాలా సంతోషంగా కనిపించారు. ఆమె స్వీట్ తినిపించిన తర్వాత జగన్ ఆమెను ఆశీర్వదించారు. కింద ఆ వీడియో ఉంది చూడవచ్చు.