“నిన్న చేగువేరా.. నేడు సావర్కర్.. రేపు గాడ్సే”… పవన్ పై నారాయణ ఫైర్!

బీజేపీతో కలిసి నడుస్తున్న వేళ కమ్యునిస్టులు పవన్ పై ఫైరవుతున్నారు. పవన్ లాంటి వ్యక్తి బీజేపీతో కలిస్తే లౌకికవాదానికి ముప్పని అంటున్నారు. ఇదే సమయంలో తీవ్రస్థాయిలో ఫైరవుతున్నారు. ఈ సందర్భంగా సీపీఐ నారాయణ… పవన్ పై తనదైన శైలిలో పంచులు వేస్తూ, ఎద్దేవా చేస్తూ, ఫైరయ్యారు.

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎన్డీయే మిత్రపక్ష కూటమి సమావేశంకోసం ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తనదైన శైలిలో స్పందించారు. ఈ సందర్భంగా… పవన్ పై నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా… పవన్ ను ఒక “దళారి”గా నారాయణ అభివర్ణించడం గమనార్హం.

అవును… పవన్ కల్యాణ్‌ తో పొత్తు పెట్టుకుని 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన వామపక్షాల నాయకులు ఆయనపై భగ్గుమంటోన్నారు. నిలకడలేని రాజకీయ నాయకుడిగా పవన్ ను అభివర్ణిస్తూ ధ్వజమెత్తుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఆయనను పావుగా వాడుకుంటోందని మండిపడుతున్నారు.

ఈ సందర్భంగా… పవన్ రాజకీయాలు చేయడానికి వచ్చినట్లు కనిపించట్లేదని సందేహం వ్యక్తం చేసిన సీపీఐ సీనియర్ నేత కే నారాయణ… నిన్న తనకు చెగువేరా ఆదర్శమని, ఆయనలా డ్రెస్సులు వేసుకున్న పవన్ కల్యాణ్.. ఇప్పుడు మితవాదులైనటువంటి సావర్కర్‌ గా మారిపోయాడంని అన్నారు. ఇక రేపు గాడ్సేలా తుపాకీ పట్టుకునేందుకు సిద్ధమవుతాడంటూ ఎద్దేవా చేశారు.

ఇదే క్రమంలో… పవన్‌ కల్యాణ్‌ ఒక దళారీ అని.. అందుకే టీడీపీ – బీజేపీ మధ్య అనుబంధానం చేస్తున్నాడని.. ఈ మధ్యవర్తిత్వం అస్సలు మంచిది కాదని నారాయణ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా… గతంలో పవనే ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలతో పోల్చి.. ఇప్ప్డు అసలు ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీతో ఎలా అంటకాగుతారు అంటూ నారాయణ.. పవన్‌ ను నిలదీశారు!