వైసీపీ ర్యాలీలో సీఎం పవర్ స్టార్ అంటూ కామెంట్లు.. జాగ్రత్త పడాల్సిందే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ఏపీ ప్రజలలో అందరూ భావించకపోయినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం కోరుకుంటున్నారనే సంగతి తెలిసిందే. చోడవరంలో వైసీపీ ర్యాలీలో కొంతమంది సీఎం పవర్ స్టార్ అంటూ కామెంట్లు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ నేతృత్వంలో విద్యార్థి భేరీ నిర్వహించగా కొంతమంది విద్యార్థులు జనసేనకు అనుకూలంగా నినాదాలు చేయడం విషయంలో విమర్శలు వ్యక్తమయ్యాయి.

 

మూడు రాజధానులకు మద్దతుగా జరిగిన ర్యాలీలో పవన్ కళ్యాణ్ పేరు వినిపించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. వైసీపీ నేతలు సైతం ఈ ఘటనతో అవాక్కయ్యారు. అయితే ఈ తరహా ఘటనల వల్ల పోయేది వైసీపీ పరువేనని మరి కొందరు కామెంట్లు చేస్తుండటం గమనార్హం. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా వైసీపీ తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు.

 

వైసీపీ ఇతర పార్టీలు విమర్శించడానికి ఏ అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మరి కొందరు సూచనలు చేస్తున్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చే ఏ ఒక్క అవకాశాన్ని ఇవ్వకుండా ప్రభుత్వం జాగ్రత్త వహించాల్సి ఉంది. రాజశేఖర్ రెడ్డి మంచి పరిపాలన సాగించినా 2009 ఎన్నికల్లో మరీ అనుకూల ఫలితాలు రాలేదనే విషయాన్ని జగన్ గుర్తుంచుకోవాలి.

 

ఏపీ ప్రజలు సంక్షేమ పథకాలతో పాటు ఇతర విషయాలలో చాలా వాటిని పరిగణనలోకి తీసుకుంటారు. జగన్ సర్కార్ ఈ విషయాలను సైతం గుర్తుంచుకుని పాలన సాగిస్తే మాత్రం 2024 ఎన్నికల్లో కూడా వైసీపీ అధికారంలోకి రావడం గ్యారంటీ అని చెప్పవచ్చు. సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజల్లో వైసీపీకి ఎక్కువమంది అనుకూలంగా ఉండటం గమనార్హం.