ప్రస్తుతం ఏపీలో వైసీపీ వర్సెస్ జనసేన అనే వార్ నడుస్తుంది. జగన్ ను గద్దెదింపడమే తన ఏకైక లక్ష్యం అని పవన్ తన కేడర్ కు సూచించిన అనంతరం… జగన్ తనదైన శైలిలో ఫైరయ్యారు. దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అంటూ సూటిపోటి మాటలతో చితకొట్టేశారు. సీఎం సీటు వద్దు అని పవన్ చెబుతుంటే… మాకు ఎమ్మెల్యేగా కూడా వద్దు అని గడిచిన ఎన్నికల్లో భీమవరం – గాజువాక ప్రజలు చెప్పారని ఎద్దేవా చేశారు. అనంతరం ఈ వార్ మరింత హీటెక్కింది.
ఇందులో భాగంగా సూట్ కేసులనిండా డబ్బులు పెట్టుకుని సీఎం జగన్ నడచి వెళ్లిపోతున్నట్టుగా పాపం పసివాడు అనే టైటిల్ తో ఇటీవల ఓ కార్టూన్ వేయించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తన ట్విట్టర్లో ఆ కార్టూన్ ని పోస్ట్ చేసి విమర్శలు ఎక్కుపెట్టారు, అక్కడితో ఆగకుండా ఆ వ్యవహారాన్ని ఓ ఎపిసోడ్ లాగా కొనసాగిస్తున్నారు. దీనిపై వైసీపీ నేతలు ఫుల్ కౌంటర్స్ వేశారు. ఈ సమయంలో ఆర్జీవీ వేసిన సెటైర్స్ మరొకెత్తు. దీంతో… ఈసారి పవన్ పై కార్టూన్ వేయడం వైసీపీ వంతయ్యింది.
వైసీపీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి కౌంటర్ గా మరో కార్టూన్ ని బయటకొదిలారు. చంద్రబాబు చంకనెక్కిన పవన్ పుల్ల ఐస్ తింటున్నట్టుగా కార్టూన్ వేశారు, కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ కార్టూన్ ఆన్ లైన్ లో వైరల్ అవుతుంది. “ప్యాకేజీ స్టార్ అంటే.. కోపంతో ఊగిపోయే ఈ పాపం పసోడు.. చివరికి.., నేను ప్యాకేజీ స్టార్ నే.. అని రుజువు చేస్తూ.. చంద్రబాబు చంకనెక్కాడు!!” అంటూ ఆ కార్టూన్ కి కామెంట్ జత చేశారు.
కాగా.. ఆమధ్య తెలంగాణలో కూడా ఫ్లెక్సీ వార్ నడిచిన సంగతి తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత ఈడీ విచారణను ఎదుర్కొంటున్న సమయంలో… మోడీపై బీఆరెస్స్ శ్రేణులు భాగ్యనగరం నిండా ఫ్లెక్సీలు వేసి “వాషింగ్ పౌండర్ నిర్మా” అంటూ ఎద్దేవా చేశారు. ఇప్పుడు దాదాపు అదేస్థాయిలో ఏపీలో కార్టూన్ వార్ నడుస్తోంది. మరి ఇలా మొదలైన కార్టూన్ వార్ ఏ స్థాయికి వెళ్తుందనేది వేచి చూడాలి.
ప్యాకేజీ స్టార్ అంటే.. కోపంతో ఊగిపోయే ఈ పాపం పసోడు.. చివరికి..,
నేను ప్యాకేజీ స్టార్ నే.. అని రుజువు చేస్తూ.. చంద్రబాబు చంకనెక్కాడు!!#PackageStarPK #CBNPolitricks pic.twitter.com/Nlvejjvkja— YSR Congress Party (@YSRCParty) May 18, 2023
