పవన్ కౌంట్ 373… వెయ్యి పూర్తి చేయమంటున్న అంబటి!

పవన్ పై సాగదీస్తూ స్మూత్ గా రాడ్ లు దింపుతారు అనే పేరున్న అంబటి రాంబాబు మరోసారి ఫైరయ్యారు. మూడు పెళ్లిల్లు, నాలుగు పెళ్లిల్లు అంటుంటే పవన్ కి కోపం వస్తుంది కాబట్టి… ఇకపై ఏకపత్నీవ్రతుడు అని పిలుస్తామని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు అంబటి రాంబాబు.

పవన్ కల్యాణ్ వారాహి వరుస ఎపిసోడ్ ల లాగే మంత్రి అంబటి రాంబాబు కూడా పవన్ కి కౌంటర్లిచ్చేందుకు వరుసగా ప్రెస్ మీట్లు పెడుతున్న సంగతి తెలిసిందే. అక్కడ పవన్ స్పీచ్ ముసిని వెంటనే ప్రభుత్వంపై కామెంట్లు చేస్తే పేర్ని నాని.. పార్టీపై కామెంట్లు చేస్తే అంబటి మైకుల ముందుకు వచ్చేస్తున్నారు. పవన్ కి ఫుల్ గా ఇచ్చిపడేస్తున్నారు.

ఇందులో భాగంగా జగన్ ని ఏక వచనంతో సంభోదిస్తాను అని పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో జగన్ జగన్ అంటూ సీఎం జగన్ పేరుని వెయ్యిసార్లు తలుచుకుంటే పవన్ కల్యాణ్ చేసిన పాపాలు పరిహారం అవుతాయని అంటున్నారు అంబటి రాంబాబు. ఇప్పటి వరకు పవన్ 373 సార్లు జగన్ పేరు తలచుకున్నారని, వీలైనంత త్వరలో మిగిలినవి కూడా పూర్తిచేసేస్తే… మోక్షం కలుగుతుందని సెటైర్లు వేశారు.

ఈ సందర్భంగా… పవన్ కి మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉందని మరోసారి చెప్పిన అంబటి… ఎవరైనా చికిత్స చేసేవారు ఉంటే ముందుకు రావాలని, ఔత్సాహిక వైద్యులకు పవన్ ఒక కేస్ స్టడీలాగా పనికొస్తారని సూచించారు. అదేవిధంగా… పెళ్లిళ్ల గురించి మాట్లాడితే పవన్ కు కోపం వచ్చి ఊగిపోతున్నారన్ని.. ఇకపై పవన్ ను ఏకపత్నీవ్రతుడు అనే తాము ఒప్పుకుంటున్నామని సెటైర్లు పేల్చారు.

ఏక పత్నీవ్రతుడంటే… “ఏక కాలంలో ఒక పత్నితోనే ఉంటారని అర్ధం” ఈ సమాధానం బాగుందా అని ప్రశ్నించారు మంత్రి అంబటి రాంబాబు!

ఇక రెండు ప్యాకేజీలుగా ఉన్న వరాహం యాత్ర పూర్తి చేసిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన అంబటి… మర్యాదకు మారుపేరైన గోదావరి జిల్లాల్లో ఎంత అమర్యాదగా మాట్లాడవయ్యా అంటూ పవన్ ను ప్రశ్నించారు.

ఇదే క్రమంలో… గోదావరి జిల్లాల నుంచి పవన్ వెళ్లిపోయారని చెప్పిన మంత్రి… మళ్లీ ఆయన తిరిగి రావాలంటే “లెక్క” తేలాలని ఆ “లెక్క” ని నాదెండ్ల మనోహర్ టీడీపీ ఆఫీసుకెళ్లి తేల్చితే అప్పుడు పవన్ వస్తారని చెప్పారు. ఇదే సమయంలో టీడీపీ ఆఫీసునుంచి జనసేన ఆఫీసుకి సొరంగ మార్గం తవ్వే కార్మికుడు నాదెండ్ల మనోహర్ అని అంబటి ఎద్దేవా చేశారు.