సుమారు రెండు నెలల లాంగ్ గ్యాప్ తర్వాత ఏపీకి వచ్చారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఏపీలో ఏ విపత్తు వచ్చినా రెక్కలు కట్టుకువచ్చి బాధితులకు అండగా ఉండే విషయంలో పవన్ అస్సలు తగ్గరు. అది ఇప్పటం గ్రామం అయినా, శ్రీకాకుళం కిడ్నీ బాధితుల ఇష్యూ అయినా, నేడు అకాల వర్షాలతో రైతులకు జరిగిన పంట నష్టం అయినా… షూటింగ్ గ్యాప్ ఉంటే పవన్ వెంటనే ఏపీలో వాలిపోతారు.
దీంతో జనసైనికులు వింత కోరిక ఒకటి ఆన్ లైన్ వేదికగా బయటపెట్టారు. తుఫానులు, భూకంపాలు వంటివి ఏపీలో ఎక్కువగా రావాలని ఒక విచిత్రమైన కోరిక వెళ్లబుచ్చుతున్నారు. ప్రస్తుతం ఆన్ లైన్ లో ఈ కోరిక హల్ చల్ చేస్తుంది. అయితే ఈ కోరికపై నెగిటివ్ కామెంట్స్ పెరుగుతుండటంతో ఆ పోస్ట్ ను వెంటనే తొలగించారు సదరు జనసైనికుడు. అయితే డీప్ గా ఆలోచిస్తే ఆ జనసైనికుల ఆవేదనలో అర్ధం ఉందని అంటున్నారు పరిశీలకులు.
ఇక్కడ చూడాల్సింది వారి వింత కోరికలో ఉన్న ప్రమాధాన్ని కాదని… ప్రమాధం వస్తేనే పవన్ ఏపీకి వస్తున్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని వారు అభిప్రాయపడుతున్నారు. జనసైనికులు ఎంత కోరుకున్నా, ఎన్ని రకాలుగా వేడుకున్నా… ఏపీ రాజకీయాల్లో పవన్ పూర్తిస్థాయిలో రంగంలోకి దిగడం లేదు. కానీ… ఏదైనా ప్రమాధాలు, విపత్తులు జరిగితేమాత్రం వెంటనే ప్రత్యేక విమానంలో వాలిపోతున్నారు.
ఈ విషయాన్ని శృతిమించిన ప్రేమతో ఆలోచించిన జనసైనికులు అలా కోరుకున్నారే తప్ప… వారికి మరో దురుద్దేశ్యం లేదని విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా… పవన్ కూడా “జగన్ పాలన బాగుంది కాబట్టి షూటింగులు చేసుకుంటున్నాను… విపత్తులు వస్తే మాత్రం ఏపీకొచ్చి చుట్టం చూపుగా పలకరిస్తున్నాను” అన్నచందంగా చేస్తున్న ఈ రాజకీయాలు జనసైనికులకు చికాకు తెప్పిస్తున్నాయడానికి ఇదొక ఉదాహరణగా భావించొచ్చేమో!!
