(సూర్యం)
కొద్ది కాలం క్రితం వరకూ పవన్ కళ్యాణ్ గురించి ఎప్పుడూ ఏదో ఒకటి సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉండేది రేణు దేశాయ్. అయితే రీసెంట్ గా విడాకులు తీసుకుని, మళ్లీ వివాహం చేసుకన్న ఆమె ఇక పవన్ విషయాలుకు బై చెప్పేసినట్లే అని అంతా భావించారు. అయితే ఊహించని విధంగా మళ్లీ పవన్ ప్రస్తావన తెచ్చింది. పవన్ తో గడిపిన క్షణాలను నెమరువేసుకుంటూ రీసెంట్ ఒక ఫొటోను షేర్ చేసి షాక్ ఇచ్చింది.
పవన్ కల్యాణ్ దర్శకత్వంలో …ఆయన సరసన రేణు దేశాయ్ జంటగా నటించిన ‘జానీ’ సినిమా నాటి విశేషాలను రేణు దేశాయ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారామె. ఆ చిత్రం షూటింగ్ ప్రారంభం కావడానికి రెండు వారాల ముందు తనను హీరోయిన్ గా ఎంపిక చేశారని.. కానీ మొదట్లో తాను ఒప్పుకోలేదని.. చివరికి పవన్ తనను ఒప్పించారని రేణు తెలిపారు.
ఆమె మాటల్లోనే…‘‘జానీ సినిమాకు నేను మొదట ప్రొడక్షన్ డిజైనర్ నే. అయితే షూటింగ్కు రెండు వారాల ముందు నన్ను ఈ సినిమాకు హీరోయిన్గా ఎంపిక చేశారు. మొదట నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే అప్పుడు నా ఇంట్రస్ట్ మొత్తం ప్రొడక్షన్ డిజైనింగ్, టెక్నికల్ విషయాలపైనే ఉంది.
కానీ చివరికి పవన్ నన్ను ఒప్పించారు. దాదాపు ఏడు నెలల పాటు రోజుకు 17 గంటలు పనిచేశా. ఓ ప్రక్క ప్రొడక్షన్ డిజైనర్గా పనులు చూసుకుని, మేకప్ రూమ్కి వెళ్లి హీరోయిన్గా రెడీ అవ్వాల్సి వచ్చేది. జీవితం ఏదైనా సవాలు విసిరితే.. స్వీకరించ గలగాలి. అప్పుడే మనం పర్శనల్ గానూ, ప్రొఫిషినల్ గానూ ఎంతో నేర్చుకుంటాం’’ అని రేణు ఇన్స్టాగ్రాంలో పేర్కొన్నారు. అంతా బాగానే ఉంది కానీ ఇంకా పవన్ కళ్యాణ్ మాట్లాడటం ఎందుకు…అని కొందరంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ వంటి వ్యక్తిని మరిచిపోవటం, ఆ అనుభూతులను వదిలేయటం సాధ్యమయ్యే పనేనా చెప్పండి.