రజనీ మెట్లపై నుంచి జారి పడి.. మోకాలికి తీవ్ర రక్తస్రావం

సూపర్‌స్టార్‌ రజనీకాంత్, బాలీవుడ్‌స్టార్‌ అక్షయ్‌ కుమార్‌లు కలిసి నటిస్తున్న చిత్రం ‘2.0’.ఈ చిత్రం రిలీజ్ కు సిద్దపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ పెంచారు. ఈ నేఫద్యంలో మీడియాకు ఇంటర్వూ ఇస్తూ ..శంకర్ చెప్పిన విషయం ఒకటి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

‘2.0’ సినిమా షూటింగ్ సమయంలో రజనీకాంత్‌ తీవ్రంగా గాయపడ్డారట. ఈ విషయాన్ని దర్శకుడు శంకర్‌ ఓ ఇంగ్లీష్ పేపరుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. చెన్నైలోని మహాబలిపురం రోడ్డులో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఓ కీ సీన్ షూట్ చేస్తూండగా రజనీకి ప్రమాదం జరిగిందట.

శంకర్ మాట్లాడుతూ..‘షాట్‌ సిద్ధమయ్యాక ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా షాట్ పూర్తిచేసేయాలని రజనీ చెప్పారు. ఆ సమయంలో రజనీ మెట్లపై నుంచి జారి పడ్డారు. దాంతో ఆయన మోకాలికి తీవ్ర రక్తస్రావమైంది. కానీ దీని గురించి నాకు ఎవ్వరూ చెప్పలేదు. నేను సెట్స్‌కు వచ్చాక రజనీ నావద్దకు వచ్చి ‘అంతా సిద్ధమే కదా?’ అని అడిగారు. నేను ఆయనకు సీన్ గురించి వివరించి చెప్పాను. ఆ తర్వాత ఆయన మేకప్‌ రూంకి వెళ్లిపోయారు. ఆ సమయంలో సెట్స్‌లోని వారంతా ఏదో సీరియస్‌గా మాట్లాడుకుంటున్నారు.’

‘అప్పుడు రజనీ మేనేజర్‌ నా వద్దకు వచ్చి జరిగిన విషయం చెప్పారు. అది విని నేను షాకయ్యాను. రజనీ షాట్‌ చేయలేరనిపించింది. వెంటనే ఆయన్ను దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లాలనుకున్నాం. కానీ రజనీ మాత్రం ఆస్పత్రికి వద్దన్నారు.షూటింగ్ పూర్తిచేయాలని పట్టుబట్టారు. మేం బతిమాలితే.. ఒక్క షాట్‌ పూర్తిచేసి ఆస్పత్రికి వెళ్తానని చెప్పారు. ఆయన్ని ట్రీట్మెంట్ నిమిత్తం తరలించాక మాకు తెలిసిన విషయం ఏంటంటే.. ఆయన మోకాలికి పెద్ద దెబ్బేతగిలింది. దాంతో నెలరోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. కానీ రజనీ ఒప్పుకోలేదు.షూటింగ్ పూర్తిచేయాలని చెప్పారు. ఓ ఆర్టిస్ట్‌గా రజనీకి పని పట్ల ఉన్న నిబద్ధతను చూసి నాకు ముచ్చటేసింది.’ అని వెల్లడించారు శంకర్‌.

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ స్క్రీన్లపై ‘2.ఓ’ను విడుదల చేయడానికి దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. తిరుచ్చిలోని వివిధ స్క్రీన్లలో ఉదయం 4.30 నుంచి 9 గంటలలోపు 20 కన్నా ఎక్కువ షోలను వేయాలని పంపిణీదారులు భావిస్తున్నారట. దుబాయ్‌లోని అతిపెద్ద మల్టీప్లెక్స్‌ VOX సినిమాస్‌లో ‘2.ఓ’ను రోజుకు 100 షోల కంటే ఎక్కువ ప్రదర్శించడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

సైన్స్ ఫిక్షన్ సబ్జెక్టుతో శంకర్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమానవంబరు 29న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకు సిద్ధమౌతోంది. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు ఉన్న విపరీతమైన క్రేజ్‌ నేపథ్యంలో ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో రికార్డ్ లు క్రియేట్ చేయటం ఖాయమనేది ఖాయమైపోయింది.