సినిమా రంగంలో ఓ విజయవంతమైన దర్శకుడిగా గుర్తింపు పొందిన శంకర్, కెరీర్ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారీ అంచనాల నడుమ వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమా ఫలితం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో, శంకర్ ఫోకస్ పూర్తిగా తారుమారైనట్లు ఇండస్ట్రీ టాక్. తెలుగు మార్కెట్లో తన స్థానం పెంచుకోవాలనుకున్న ఆయన ఆశలు ఆ సినిమా తో తుడిచిపెట్టుకుపోయినట్టయ్యాయి.
ప్రస్తుతం శంకర్ పూర్తి దృష్టి భారతీయుడు 3 మీదే ఉంది. అయితే, రెండో భాగం డిజాస్టర్ అయ్యిన తర్వాత మూడో భాగంపై కూడా ఆడియన్స్లో పెద్దగా హైప్ కనిపించడం లేదు. కొద్దిరోజులుగా ఈ సినిమా ఓటీటీలో నేరుగా విడుదల అవుతుందనే రూమర్లు వచ్చినా, మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.. ఇది థియేట్రికల్ రిలీజ్ అవుతుందని. అయినా సరే, థియేటర్లలో ప్రేక్షకులను ఎలా ఆకర్షిస్తుందో అనే సందేహం మారదు.
ఇక, ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ ఆసక్తికర రూమర్ వినిపిస్తోంది. భారతీయుడు 3 విడుదల తర్వాత శంకర్ సుమారు రెండేళ్ల పాటు కొత్త సినిమాకు ఫుల్ బ్రేక్ తీసుకోనున్నారట. ఈ గ్యాప్ ద్వారా ఆయన పూర్తిగా రిలాక్స్ అయి, కొత్త ఎనర్జీతో ఫ్రెష్ ఐడియాస్తో రావాలనే ఆలోచన చేస్తున్నారట. గతంలో కూడా శంకర్ ఒక సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న సందర్భాలున్నాయి. కానీ ఈసారి బ్రేక్ మరింత దీర్ఘం కావచ్చని అంటున్నారు. శంకర్ తిరిగి ట్రాక్లోకి రావాలంటే, కొత్త రైటర్లను తీసుకుని, ఫ్రెష్ స్క్రిప్ట్లు సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు. మూసపద్ధతిలో నడవడం కంటే, మళ్లీ తన మార్క్ మేకింగ్ చూపించాలని చెబుతున్నారు.