ప్రముఖ దర్శకుడు రాజమౌళి ..బాహుబలితో అంతర్జాతీయ కీర్తి వచ్చింది. ఆయన్ని తలవకుండా ఈ రోజున పెద్ద సినిమాలు కలెక్షన్స్ మాత్రమే కాదు..పంక్షన్స్ కూడా లేని పరిస్దితి వచ్చేస్తోంది. తాజాగా రజనీకాంత్ ..రోబో 2 చిత్రం ట్రైలర్ లాంచింగ్ ఫంక్షన్ లో మాట్లాడుతూ రాజమౌళిని తలుచుకున్నారు. శంకర్, రాజమౌళి, రాజ్కుమార్ హిరాణీ లాంటి వారు జెమ్స్ ఆఫ్ ఇండియన్ సినిమా అన్నారు రజనీ.
సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రజనీ చిత్రం 2.0 ట్రైలర్ ఈ రోజు వచ్చేసింది. ఓ రేంజి విజువల్స్ గ్రాఫిక్స్తో రూపొందించిన ఈ ట్రైలర్కు అన్ని చోట్ల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ ట్రైలర్ లాంచింగ్ సందర్భంగా హీరో రజనీకాంత్ మాట్లాడుతూ చాలా ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ చిత్రం షూటింగ్ సందర్భంగా మానసికంగా శారీరకంగా చాలా శ్రమపడాల్సి వచ్చిందని రజనీ అన్నారు.
రజనీ కాంత్ మాట్లాడుతూ… ‘దాదాపు పన్నెండు కేజీల సూట్వేసుకొని షూటింగ్ చేయటం కష్టమనిపించింది. అదే సమయంలో 3డీలో తెరకెక్కిస్తున్న కారణంగా ఒక్కే షాట్ 8, 9 సార్లు తీయాల్సి వచ్చేది. ఓ దశలో ఇక సినిమా చేయలేనని శంకర్తో చెప్పేశా. కానీ శంకర్ మీరే ఈ సినిమా చేయాలి, చేయగలరని నన్ను ఒప్పించారు’అని తెలిపారు.
అలాగే ‘నిర్మాత శుభకరన్ కూడా ఎంతో సహకరించారు. షూటింగ్ మొదలు పెట్టిన కొద్ది రోజులకే నా హెల్త్ దెబ్బతింది. దీంతో షూటింగ్ చాలా ఆలస్యమైంది. అప్పుడు నిర్మాత నాలుగు నెలలు కాదు నాలుగు సంవత్సరాలైనా మీరు రెస్ట్ తీసుకోండి మీ ఆరోగ్యం ముఖ్యం అన్నారు. వారి సహకారం వల్లే సినిమా ఇంత బాగా వచ్చిందన్నా’రు రజనీ.
అంతేకాదు ఈసినిమా చేయటానికి రజనీనో , అక్షయ్నో నన్నో నమ్మి రూ. 600 కోట్లు నిర్మాత పెట్టుబడి పెట్టలేదు, కేవలం శంకర్ను నమ్మి మాత్రమే నిర్మాత ఇంత ఖర్చు పెట్టారని తెలిపారు. అంతేకాదు శంకర్ ఇండియన్ స్పిల్ బర్గ్, జేమ్స్ కామరన్ అన్నారు. శంకర్, రాజమౌళి, రాజ్కుమార్ హిరాణీ లాంటి వారు జెమ్స్ ఆఫ్ ఇండియన్ సినిమా అన్నారు రజనీ.