‘సత్యాగ్రహి’ అందుకే ఆపేసా: పవన్

అప్పట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటించిన “సత్యాగ్రహి” సినిమా గుర్తుందా..? పవన్ స్వీయ దర్శకత్వంలో తమిళ నిర్మాత ఏ.ఎం.రత్నం భారీ స్థాయిలో నిర్మిస్తానని ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన ఈ సినిమాకు ప్రారంభంలోనే బ్రేకులు పడ్డాయి. అప్పటినుండి ఇప్పటివరకు ‘సత్యాగ్రహి’తెరకెక్కనేలేదు.

ఆ సినిమానే కాదు, ఏకంగా నిర్మాత రత్నం కూడా సినిమాలకు దూరంగా జరిగి చాలా కాలం గ్యాప్ తీసుకున్నారు. అయితే మళ్లీ ఇంతకాలానికి సత్యాగ్రహి ప్రసక్తి వచ్చింది. ఈ విషయమై పవన్ మాట్లాడారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ అమెరికాలో పర్యటిస్తున్నారు.

ప్రవాస గర్జన పేరుతో ప్రవాసులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా ఈ విషయం ప్రసక్తి వచ్చింది. సత్యాగ్రహి అనే సినిమా ఆపేసింది.. దాన్ని నిజ జీవితంలో చేసి చూపించడానికన్నారు.

పవన్ కళ్యాణ్ ఒక హీరోగా టాప్ స్థానంలో ఉండగానే ఆ స్థాయిని వదిలేసి రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. భవిష్యత్తుల్లో రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశ్యం ఉండటంతోనే ఆయన ఆ సినిమాను చేయలేదు. అంతేకాదు ఆ సినిమాను నిజ జీవితంలో నిజం చేయడానికే ప్రయత్నిస్తున్నాను అనటం అభిమానుల్లో ఆనందాన్ని కలగ చేస్తోంది.