మ‌హేష్ భార్య‌ని కాకాప‌డుతున్న హీరోయిన్!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు క‌థానాయ‌కుడిగా న‌టించనున్న 27వ చిత్రానికి ప‌ర‌శురాం డైరెక్ట్ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. స‌ర్కార్ వారి పాట టైటిల్ తో తెర‌కెక్క‌నుంది. ప్ర‌స్తుతం స్ర్రిప్ట్ లో మార్పులు జ‌రుగుతున్నాయి. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో అమెరికాలో నేప‌థ్యంలో తెర‌కెక్కించాల్సిన క‌థ‌ను ఇండియాకు మారుస్తున్నారు. అలాగే చాలా స‌న్నివేశాల్లో మార్పులు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇంకా హీరోయిన్లు, కొంత మంది కీల‌క న‌టీన‌టుల‌ను ఎంపిక చేయాల్సి ఉంది. ఇలా అన్ని ర‌కాల ప‌నులు పూర్తిచేసి ఆగ‌స్టు లేదా అక్టోబ‌ర్ లో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభిచాల‌ని స‌న్నాహాలు చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో మ‌హేష్ స‌ర‌స‌న హీరోయిన్ న‌టించేది? ఎవ‌రు అన్న దానిపై స‌స్పెన్స్ కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే కియారా అద్వాణీ, కీర్తి సురేష్ పేర్లు వినిపించాయి. వీళ్లిద్ద‌రిలో ఎవ‌రో ఒక‌ర్ని తీసుకునే అవ‌కాశం ఉంద‌ని జోరుగా ప్ర‌చారం సాగుతోంది. గ‌తంలో కియారా భ‌ర‌త్ అనే నేను లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. అమ్మడు తొలి సినిమాతోనే మంచి న‌టిగా పేరు తెచ్చుకుంది. ఈ నేప‌థ్యంలో ఆ భామ పేరు బ‌లంగా వినిపిస్తోంది. ఇక కీర్తి రేసు లో ఉంది. అయితే ఇంకా ఎవ‌ర్ని ఖ‌రారు చేయ‌లేదు. ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌రో కొత్త భామ పేరు వినిపిస్తోంది. సాయి మంజ్రేక‌ర్ అనే కొత్త భామ పేరు ఇప్పుడు తెర‌పైకి వ‌చ్చింది.

మ‌హేష్ మంజ్రేక‌ర్ కుమార్తెగా బాలీవుడ్ లో తెరంగేట్రం చేసిన అమ్మ‌డు ద‌బాంగ్ -3 త‌ర్వాత ప‌లు సినిమాల్లో న‌టించింది. అయితే స‌ర్కార్ వారి పాట‌లో సాయి మంజ్రేక‌ర్ పేరు అంతే జోరుగా వినిపిస్తోంది. మ‌రో విషేషం ఏంటంటే? ఈ అమ్మ‌డు మ‌హేష్ స‌తీమ‌ణి న‌మ్ర‌త శిరోద్క‌ర్ కి మంచి స్నేహితురాలుట‌. స్నేహితురాలి రిఫ‌రెన్స్ కూడా వినియోగించుకుంటున్న ప్ర‌చారం సాగుతోంది. హీరోయిన్ ఎంపిక విష‌యంలో ద‌ర్శ‌కుడు క‌న్నా మ‌హేష్ ఎక్కువ‌గా ఇన్వాల్వ్ అవుతారు. మ‌హేష్ కు ప‌ర్ పెక్ట్ జోడీ అయితేనే ద‌ర్శ‌కుడు అమెని ఎంపిక చేయాల్సి ఉంటుంది. అందులో న‌మ్ర‌త పాత్ర కూడా ఉంటుంది. కాబ‌ట్టి సాయి మంజ్రేక‌ర్ ని ఎంపిక చేసినా ఆశ్చ‌ర్య పోన‌వ‌స‌రం లేదు.