కాషాయమయమైన సెన్సార్ బోర్డు

హైదరాబాద్ సెన్సార్  కార్యాలయానికి కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ 53 మంది కొత్త  సభ్యులను  నియమించింది . రెండు రోజుల క్రితం నూతన సభ్యులను నియమిస్తున్నట్టు కేంద్ర  సమాచార శాఖ మంత్రి రాజ్యవర్ధన్  సింగ్  రాథోర్  నుంచి హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయ అధికారి రాజశేఖర్ ఉత్తర్వులు వచ్చాయి . ఈ 53 మందిలో 20 మంది మహిళాలు 33 మంది పురుషులు ఉన్నట్టు  తెలిసింది .

అయితే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఈ సభ్యుల్లో ఎక్కువ మంది భారతీయ జనతా పార్టీ కార్య  కర్తలు ఉన్నట్టు  విశ్వసనీయ సమాచారం . ఈ లిస్టులో మహిళా సభ్యుల పేర్లను పురుషులుగా , పురుషులను మహిళలుగా పంపించారని , కొందరి సభ్యుల ఫోన్ నంబర్లు కానీ, central board film certificationచిరునామాలు కానీ లేవని , అందుకే హైదరాబాద్ అధికారి ఈ లిస్టును తిరిగి ఢిల్లీ పంపినట్టు తెలిసింది .

ఒక సినిమాను ఇద్దరు పుషులు, ఇద్దరు మహిళలతో ప్రాంతీయ సెన్సార్ అధికారి చూసి సెన్సార్ సర్టిఫికెట్ ను జారీచేస్తారు . ప్రస్తుతం సెన్సార్ బోర్డు చైర్మన్ గా  ప్రసూన్ జోషి వున్నారు . ఇక దేశ వ్యాప్తంగా  12 మంది కేంద్ర సెన్సార్ బోర్డులో వున్నారు .

 గౌతమి,  నరేంద్ర కోహిలి , నరేష్ చంద్ర లాల్,నేలి హెర్బర్ట్ నాఙ్కయ్నరీజ్ , వివేక్ అగ్నిహోత్రి , జీవితా  రాజశేఖర్ , వాణి త్రిపాఠి టిక్కూ , వామన్ కేంద్రే , విద్యాబాలన్ ,నాగాభరణ ,మిహార్  భూటియా , రమేష్ పతంగ్  వున్నారు . వీరి దేశంలో వున్నా సెన్సార్ కార్యాలయాల్లో విధులు నిర్వర్తిస్తారు .