విజయ్ దేవరకొండ విషయంలో మళ్ళీ కెలికిన అనసూయ..!

ఇప్పుడు టాలీవుడ్ సినిమా దగ్గర వినిపిస్తున్న లేటెస్ట్ సినిమా పేరు “లైగర్”. సెన్సేషనల్ విజయ్ దేవరకొండ అలాగే దర్శకుడు పూరి జగన్నాథ్ నుంచి వచ్చిన ఈ భారీ చిత్రం పాజిటివ్ టాక్ కన్నా నెగిటివ్ టాక్ నే ఎక్కువ అందుకుంది. దీనితో అయితే ఈ సినిమాతో చాలా మంది సోషల్ మీడియా ప్రేక్షకులకి దొరికిపోయారు.

అయితే వారిలో గతంలో ప్రముఖ తెలుగు గ్లామరస్ యాంకర్ అనసూయ భరద్వాజ్ మరియు విజయ్ దేవరకొండ లకు గత ఐదేళ్ల కితం వచ్చిన “అర్జున్ రెడ్డి” టైం కాంట్రవర్సీ బాగానే గుర్తుండి ఉండొచ్చు. ఆ సినిమాలో విజయ్ దేవరకొండ చెప్పిన అభ్యంతరకర డైలాగ్ పై అనసూయ పెద్ద ఎత్తునే సంచలనం రేపింది.

ఇక ఇప్పుడు తాజాగా అయితే విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో సోషల్ మీడియాలో అనసూయ రెచ్చిపోయింది. పలు సంచలన ట్వీట్స్ తో కర్మ కాస్త లేట్ అయినా కూడా తిరిగి పక్కాగా ప్రభావం చూపిస్తుంది అని..

అమ్మని అన్నవాడు ఎవరు బాగుపడలేదు అని ఇలా తిట్టేవారు అందరికీ కొంత జ్ఞ్యానం రావాలని కోరుకుంటున్నాని నాకేమి పోయేది లేదు అంటూ ఓ రేంజ్ లో ట్వీట్స్ చేసింది. దీనితో విజయ్ విషయంలో చేసిన ఈ పోస్ట్ లు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.