గత కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా, విన్నా‘2.0’గురించిన వార్తలే..హంగామానే. చిత్ర యీనిట్ మెల్లిమెల్లిగా పబ్లిసిటీ డోస్ పెంచేస్తున్నారు. ప్రమోషన్ లో భాగంగా ‘2.0’యూనిట్ రజనీకాంత్ అభిమానులను సర్ప్రైజ్ చేస్తూ ఓ వీడియో వదిలింది. చెప్పా పెట్టుకుండా, ప్రకటన లేకుండా ఈ సినిమాలోని ‘యంతర లోకపు సుందరివే..’ పాట వీడియోను విడుదల చేసింది.
https://youtu.be/GhldJIbGWSY
దీనికి యూట్యూబ్లో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం ఇది యూట్యూబ్ ట్రెండింగ్లో రెండో స్థానంలో ఉంది. ఈ పాట విడుదలైన 15 గంటల్లోనే లక్షల వ్యూస్ను సొంతం చేసుకుంది. 15 గంటల్లో తమిళంలో 2.7 మిలియన్ల మంది, హిందీలో 3.7 మిలియన్ల మంది దీన్ని చూసారు.
ఈ పాటలో రజనీ, అమీ జాక్సన్ డాన్స్ చేశారు. అదిరిపోయే విజువల్స్ తో ఊహా లోకంలో విహరిస్తూ కనిపించారు. ఎ.ఆర్. రెహమాన్ సంగీతం ఆకట్టుకుంది. విజువల్స్ సెప్షల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. అనంత శ్రీరామ్ రాసిన పాటను.. సిద్ శ్రీరామ్, సాషా తిరుపతి పాడారు.
‘2.0’ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించారు. అక్షయ్ కుమార్ విలన్ పాత్ర పోషించారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ సినిమాను నిర్మించింది. దాదాపు రూ.550 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. శాటిలైట్, డిజిటల్ తదితర హక్కుల ద్వారా ఇప్పటికే ఈ చిత్రం రూ.370 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. నవంబరు 29న ఈ చిత్రం విడుదల కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు.