రేణుదేశాయ్ కూర్చోవ‌డానికి ఇబ్బంది ప‌డిన‌ వేళ‌

రేణుదేశాయ్ కూర్చోవ‌డానికి ఇబ్బంది ప‌డిన‌ వేళ‌

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌- రేణు దేశాయ్ కాంబినేష‌న్ లో పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన బ‌ద్రి అప్ప‌ట్లో ఎంత సంచ‌ల‌న విజ‌యం సాధించిందో తెలిసిందే. పూరి-ప‌వ‌న్ కెరీర్ లో ఆ సినిమా ఇద్ద‌రికి ఓ మైలు రాయి. పూరి తొలి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుని ప‌రిశ్ర‌మ‌లో హీరోల‌, నిర్మాత‌ల దృష్టిని ఆక‌ర్షించాడు. ఆ ఒక్క స‌క్సెస్ పూరి కెరీర్ నే మార్చేసింది. తాజాగా ఈసినిమా విడుద‌లై నేటికి ( ఏప్రిల్ 20) కి 20 ఏళ్లు పూర్త‌యింది. ఈ సంద‌ర్భంగా ఆన్ సెట్స్ లో జ‌రిగిన కొన్ని అనుభ‌వాల‌ను రేణు దేశాయ్ అభిమానులతో పంచుకున్నారు.

అలాగే అప్ప‌టి ఒక పాత ఫోటోను కూడా షేర్ చేసింది. ఈ సినిమా విదేశాల్లో సిటీకి దూరంగా రిమోటో ఏరియాలో షూటింగ్ జ‌రుగుతోంది. ఆ స‌మ‌యంలో షాట్ గ్యాప్ లో కూర్చోవ‌డానికి ఏమాత్రం సౌక‌ర్యంగా లేదు. అందుబాటులో చైర్స్ కూడా లేవు. నేనేమో కింద కూర్చోలేను షూటింగ్ లో భాగంగా స్కిన్ టైట్ స్క‌ర్ట్ వేసుకున్నాను. దానితో కింద కూర్చోవ‌డం కుద‌రదు. ప‌ట్టుబ‌ట్టి కూర్చున్నా! చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే ఆ స‌మ‌యంలో చాలాసేపు నిల‌బ‌డే ఉన్నాను. ప‌వ‌న్ అప్పుడు ఓ పెద్ద బండ‌పై ప‌డుకుని సేద తీరారు. న‌న్ను మాత్రం నిల‌బెట్టేసాడు! అంటూ కొంటే వ్యాఖ్య‌లు చేసింది.

అందులో బంగాళం ఖాతంలో సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఆ పాట షూటింగ్ స‌మ‌యంలో తీసిన పిక్ నే రేణు ఇన్ స్టా వేదిక‌గా పంచుకుని ఇలా ముచ్చ‌ట‌ప‌డింది. ఆ సినిమా షూటింగ్ స‌మ‌యంలో ప‌వ‌న్ -రేణు దేశాయ్ ప్రేమ‌లో ప‌డిన సంగ‌తి తెలిసిందే. త‌ర్వాత కొన్నాళ్ల పాటు స‌హ‌జీవంన చేసిన‌నంత‌రం పెళ్లి చేసుకున్నారు. అటుపై కొన్నాళ్ల పాటు కాపురం అనంత‌రం మ‌న‌స్ప‌ర్ధ‌లు త‌లెత్త‌డంతో విడిపోయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఎవ‌రి జీవితం వారిది. పిల్ల‌లిద్ద‌రి తో క‌లిసి రేణు పూణేలో ఉంటోంది.