న‌టిపై దాడి..కంద‌కు లేని దురద క‌త్తికెందుకంట‌?

కంద‌కు లేని దురద క‌త్తికెందుకంట‌? అన్న సామెత ఇప్పుడు ఓ న‌టి- ఆమెపై విమర్శ‌లు చేసే వారికి స‌రిగ్గా స‌రిపోతుంది. భార‌త‌దేశంలో విడాకులు తీసుకున్న త‌ర్వాత ఎన్ని పెళ్లిళ్లు అయినా అధికారికంగా చేసుకునే హ‌క్కు ఉంది. అందుకు అడ్డు చెప్ప‌డానికి లేదు. కానీ కొంద‌రు మాత్రం చ‌ట్టాన్ని సైతం ధిక్క‌రించి మూడ‌వ పెళ్లి చేసుకున్న ఓ న‌టిపై మండిప‌డ్డారు. త‌మ‌కు సంబంధం లేని వ్య‌వ‌హారంపై అన‌వ‌స‌రంగా త‌ల‌దూర్చారు. వివ‌రాల్లోకి వెళ్తే! కోలీవుడ్ న‌టి వన‌త విజ‌య్ కుమార్ ఇటీవ‌లే పీట‌ర్ పాల్ అనే వ్య‌క్తిని మూడ‌వ పెళ్లి చేసుకుంది. అప్ప‌టికే రెండు పెళ్లిళ్లు చేసుకుని వ్య‌క్తిగ‌త కార‌ణ‌ల వ‌ల్ల ఇద్ద‌రికీ దూరమై విడాకులు తీసుకుంది.

ఆమెకు ముగ్గ‌రు పిల్ల‌లు కూడా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో మూడ‌వ పెళ్లి భ‌ద్ర‌త‌గాను ఉంటుంద‌ని భావించి పెళ్లి చేసుకున్న‌ట్లు తెలిపింది. అయితే ఈ పెళ్లిపై ప‌రిశ్ర‌మ‌కు చెందిన నిర్మాత ర‌వీంద్ర‌న్, ద‌ర్శ‌కురాలు ల‌క్ష్మీ రామ‌కృష్ణ‌న్, క‌స్తూరి తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసారు. అంత‌టితో ఆగ‌కుండా వ‌నిత విజ‌య్ కుమార్ పై సంచ‌ల‌న విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు చేసారు. మూడ‌వ పెళ్లి చేసుకోవ‌డానికి నువ్వు అర్హురాలివా? అంటూ అభ్యంత‌ర‌కర‌ వ్యాఖ్య‌లు చేసారు. దీంతో వాటిపై వ‌నిత కూడా ట్విట‌ర్ వేదిగా అంతే ధీటుగా స‌మాధానం ఇచ్చారు. అలాగే సోష‌ల్ మీడియాలో సూర్య‌దేవి అనే మ‌హిళ కూడా ఆ న‌టిని ఉద్దేశించి కొన్ని వీడియోలు చేసి విడుద‌ల చేసింది.

ఈ చ‌ర్య‌ల‌న్నీ చూస్తుంటే ఆ న‌టిపై కావాలానే ప‌నిగట్టుకుని చేస్తున్న‌ట్లు తేలింది. దీంతో స‌ద‌రు న‌టి వీళ్లంద‌రిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. త‌న మ‌నోభావాలు దెబ్బ‌తినేలా చేసార‌ని ఫిర్యాదులో పేర్కొంది. మాన‌సికంగా ఎంతో క్షోభ‌కు గురిచేసిన‌ట్లు తెలిపింది. కోర్టులో ప‌రువు న‌ష్టం దావా కింద పిటీష‌న్ వేసింది. ఈనేప‌థ్యంలో వాళ్లంతా కేసులో ఇరుకోక త‌ప్ప‌లేదు. ఈ మొత్తం వ్య‌వ‌హారాన్ని ఉద్దేశించి కొంత మంది నెటి జ‌నులు వ‌నితా విజ‌య్ కుమార్ కు మ‌ద్ద‌తుగా నిలిచారు. పెళ్లి అనేది ఆమె వ్యక్తిగ‌త విష‌యం. మోసం చేసి పెళ్లి చేసుకుంటే త‌ప్పు అవుతుంది గానీ…అంద‌రికీ తెలిసి చేసుకుంటే త‌ప్పు ఎలా అవుతుంద‌ని..న‌టిపై అభ్యంత‌ర కామెంట్లు చేసిన వారంద‌రిపై ప్ర‌తి దాడికి దిగారు.