Actress: ఇటీవల కాలంలో రెస్టారెంట్లు హోటల్స్ లో నాన్ వెజ్ విషయములో అనేక రకాల వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బిర్యానీ వంటి వాటిలో బొద్దింకలు వంటివి రావడం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం అన్నది మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. కేవలం ఆఫ్లైన్లో మాత్రమే కాకుండా ఆన్లైన్లో వస్తున్న ఫుడ్ విషయంలో కూడా ఇలాంటి గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి.
ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే వచ్చిన ఫుడ్ లో కూడా ఇలా బొద్దింకలు వంటి కీటకాలు రావడం, ఒకటి ఆర్డర్ చేస్తే మరొక ఫుడ్ రావడం వంటివి జరుగుతున్నాయి. ఇలాంటి అనుభవాలు సామాన్యులకు మాత్రమే కాకుండా సెలబ్రిటీలకు సైతం ఎదురవుతున్నాయి. తాజాగా తమిళ హీరోయిన్ కీ కూడా అలాంటి అనుభవం ఒకటి ఎదురయ్యింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు సాక్షి అగర్వాల్. ఈమె తమిళ హీరోయిన్ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. కాగా ఈమె ఒకరోజు పన్నీర్ బిర్యానీ తినాలని అనిపించి ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసిందట.
అయితే మంచి ఆకలి మీద ఉండటంతో పన్నీర్ బిర్యానీ అనుకునే తినడం మొదలు పెట్టిందట. సగం తిన్న తర్వాత అనుమానంగా అనిపించి చూస్తే అది పన్నీర్ బిర్యాని కాదు చికెన్ బిర్యాని అని అర్థమయ్యే ఆమె షాక్ అయిందట. అలా జీవితంలో నేను నాన్ వెజ్ తినకూడదు అనుకున్నాను. కానీ నాతో చికెన్ తినేలా చేశారు అంటూ చూసిన మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది. అయితే రెస్టారెంట్ నిర్లక్ష్యం వహించడంపై ఆమె మండిపడుతూ.. సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేసింది. ఈ వీడియో పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. సదురు సదరు రెస్టారెంట్ పై తగిన చర్యలు తీసుకోండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Actress : నాజీవితంలో అలాంటి పని చేయకూడదనుకున్నా.. కానీ నాతో అలా చేయించారు: తమిళ్ హీరోయిన్
