టిక్ టాక్ యాప్ లో జరిగే వెకిలి వేషాలు గురించి తెలిసిందే. ఆ యాప్ అందుబాటులోకి వచ్చిన కొత్తలో ఓ పద్దతి ఉండేది. ఇప్పుడా పద్దతి ఎక్కడా యాప్ లో కనిపించలేదు. టిక్ టాక్ ను ఇష్టానుసారం వినియోగించి భ్రష్టు పట్టించేస్తున్నారు. అందులో ఎలాంటి వేషమేసినా చెల్లిపోతుంది. అడిగేది ఎవరు? నీ ఇష్టం..నీ ఫోన్! అన్నట్ల తయారైంది. తాజాగా మూగ జీవాలకు హాని కలిగిస్తూ టిక్ టాక్ చేయడం ఎంత హేయమైన చర్యగా వర్ణించాలో అర్ధమవ్వని సన్నివేశం. ఓ కుర్రాడు కుక్క పిల్లను పట్టుకుని టిక్ టాక్ చేసాడు. కెమెరా వైపు చూసి అతని స్నేహితుడు ఒకే చెప్పగానే నిర్ధాక్షిణ్యంగా ఆ కుక్క పిల్లను పారే కాలువలోకి వదిలేసాడు.
దీంతో వెంటనే నీటిలో మునిగిపోయిన ఆ కుక్క పిల్ల చివరికి బతుకు జీవుడాని ఎలాగూ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుంది. ఆ వీడియో నటి కమ్ యంకర్ రష్మీ గౌతమ్ కంట పడింది. దీంతో అమ్మడు ఆ వీడియోపై…ఆ వ్యక్తిపై నిప్పులు చేరింది. బుద్ది జ్ఞానం ఉండే అలాంటి పని చేసావారా? ఒక మూగ జీవిని ఎంతలా హింసిచావో తెలుస్తుందిరా? మనిషి పుట్టుకు పుట్టవారా నువ్వు? నీకు టిక్ టాక్ పిచ్చి పీక్స్ కు చేరిందరా? నీ లాంటి వాళ్ల వల్లే మనుషులు అంతరించి పోతున్నారు…కరోనా వైరస్ లాంటివి అందుకేరా వస్తున్నాయి అంటూ చెడుగుడు ఆడేసింది. ఇంకా చాలా మంది జంతు ప్రేమికులు ఈ వీడియో పై ఆగ్రహం వ్యక్తం చేసారు. కుక్క ప్రాణాలతో చెలగాటం ఏంటిరా ? మనిషి పుట్టుక పుట్టావా? అంటూ బీజేపీ నేత మేనకా గాంధీ కూడా ఫైర్ అయ్యారు. అలాగే పోలీసుకు ఫిర్యాదు కూడా చేసారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి వాళ్ల టిక్ టాక్ ఐడీ ఆధారంగా ఆ యువకుల్ని వేటాడే పనిలో పడ్డారు.