రష్మి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన హైపర్ ఆది.. సీరియస్ అయిన రష్మి?

జబర్థస్త్ కామెడీ షో కి ఎంత మంచి ప్రేక్షకాదరణ ఉందో అందరికీ తెలిసిందే. గత 10 సంవత్సరాలుగా ప్రసారమవుతున్న ఈ కామెడీ షో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ షో లో హైపర్ ఆది చేసే కామెడీ వేరే లెవెల్ అని చెప్పవచ్చు. మొదట కంటెస్టెంట్ గా జబర్దస్త్ లో అడుగుపెట్టిన అది కొన్ని రోజులకి తనలో ఉన్న టాలెంట్ నిరూపించుకొని కమెడియన్ గా మంచి గుర్తింపు పొందాడు. హైపర్ ఆది జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత జబర్దస్త్ రేటింగ్స్ కూడా పెరిగాయని చెప్పటంలో సందేహం లేదు. జబర్దస్త్ టీం లో ఉన్న ప్రతి కంటెస్టెంట్ మీద తనదైన శైలిలో పంచులు వేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఆఖరికి అక్కడ ఉన్న జడ్జిల మీద కూడా పంచులు సెటైర్లు వేస్తూ ప్రేక్షకులను నవ్విస్తున్నాడు.

అంతేకాకుండా యాంకర్ల మీద కూడా పంచులు వేస్తూ అప్పుడప్పుడు డబుల్ మీనింగ్ డైలాగులు చెబుతూ ఉంటాడు. అయితే జబర్దస్త్ లో ఎక్కువగా డబుల్ మీనింగ్ డైలాగులు వినిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా అది వేసే పంచ్ డైలాగులలో ఎక్కువ శాతం డబుల్ మీనింగ్ డైలాగులు ఉంటాయి. ఎంతకాలం అనసూయ చుట్టూ తిరిగిన అది అనసూయ జబర్దస్త్ దూరమైన తర్వాత కొత్త యాంకర్ ని లైన్ లో పెట్టాలని ప్రయత్నిస్తూనే మరొకవైపు రశ్మి ని కూడా తనవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ షోలలో రశ్మి ని ఉద్దేశిస్తూ డైలాగులు చెబుతూ ఉంటాడు. ఇటీవల జరిగిన ఎపిసోడ్ లో కూడా రష్మీ మీద ఆది చేసిన కామెంట్స్ కి రష్మి సీరియస్ అయ్యింది.

ఓ స్కిట్ లో భాగంగా హైపర్ ఆది గతంలో రష్మీ పై జోక్స్ వేస్తూ సరదాగా నైట్ కి వస్తావా అంటాడు. మొదట హైపర్ ఆది అన్న మాటల గురించి అర్థం తెలియని రష్మీ కొంతసేపటి తర్వాత హైపర్ ఆది అన్న మాటలకు అర్థం తెలుసుకొని హైపర్ ఆదిని కోపంగా చూస్తూ ఓయ్ అని సీరియస్ అవుతుంది. ఇలా రష్మీ సీరియస్ అవ్వగానే హైపర్ ఆది కొంచెం తడుముకొని అదే పార్టీ ఉంది నైట్ కి వస్తావా అని అడిగా అంటూ మళ్లీ కవరింగ్ చేసే ప్రయత్నం చేస్తాడు. మొత్తానికి ఆది ఇన్ డైరెక్ట్ గా రశ్మిని ఇలా అనటంతో రష్మీ చాలా సీరియస్ అయింది. ఇక ఆది ఇలాంటి డబ్బులు మీనింగ్ డైలాగులు చెప్పటంతో కొంతమంది ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తుంటే మరి కొంతమంది మాత్రం ఆది డైలాగ్స్ ని ఖండిస్తున్నారు.