క‌మ‌ల్‌హాస‌న్ షాకింగ్ నిర్ణ‌యం!

క‌మ‌ల్‌హాస‌న్ త‌న అభిమానుల‌కు షాకిచ్చే నిర్ణ‌యం తీసుకున్నారు. గ‌త కొన్ని ద‌శాబ్దాలుగా వెండితెర‌పై త‌న‌దైన పాత్ర‌ల్లో న‌టిస్తూ వైవిధ్య‌మైన పాత్ర‌ల‌కు, చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచారు. రాజ‌కీయాల్లోనూ త‌న‌దైన వాణీని వినిపిస్తున్న క‌మ‌ల్ తాజాగా డిజిట‌ల్ ప్ర‌పంచం వైపు అడుగులు వేస్తున్నారు. సినిమాల్లో ఫేడ‌వుట్ అవుతున్న వారు, అయిన వారు సినిమాల‌కు దూరంగా వెళుతూ డిజిట‌ల్ మాధ్య‌మాన్ని ఎంచుకుంటున్న విష‌యం తెలిసిందే.

క‌మ‌ల్‌హాస‌న్ కూడా అలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. ప్ర‌స్తుతం ఎస్ డైరెక్ట‌ర్ శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న `ఇండియ‌న్ 2` చిత్రంలో న‌టిస్తున్నారు క‌మ‌ల్‌. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. లైకా ప్రొడ‌క్ష‌న్స్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా అండ‌ర్ షూటింగ్‌లో వుండ‌గానే క‌మ‌ల్ వెబ్ సిరీస్ ప్ర‌పంచంలోకి అడుగుపెడుతున్నారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆయ‌నే సోస‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించ‌డం ఆస‌క్తికరంగా మారింది.

అభిరుచి గ‌త ప్ర‌పంచంలోకి అడుగుపెడుతున్నందుకు ఆనందంగా వుంది. కొత్త త‌ర‌హా క‌థ‌లు చెప్ప‌డానికి ఇష్ట‌ప‌డ‌తాను. అలాంటి క‌థ‌లు చెప్ప‌డానికి ఇక్క‌డ మంచి స్కోప్ వుంది. అసంక్షాక‌మైన ప్రేక్ష‌కుల కోసం అత్యుత్త‌మ క‌థ‌ల్ని ఎంచుకునే గొప్ప అవ‌కాశం ఇది` అని క‌మ‌ల్ వెల్ల‌డించారు. క‌మ‌ల్ న‌టించ‌నున్న వెబ్ సిరీస్‌ని మ‌క్క‌ల్ నీది మ‌య్యిమ్ వైస్ ప్రెసిడెంట్ ఆర్‌. మ‌హేంద్రన్‌, దీప‌క్ ధ‌ర్ సంయుక్తంగా నిర్మించ‌బోతున్నారు.