తెలంగాణ అసెంబ్లీ డిప్యూటి స్పీకర్ గా పద్మారావు గౌడ్

తెలంగాణ డిప్యూటి స్పీకర్ గా మాజీ మంత్రి పద్మారావు గౌడ్ ఎంపిక దాదాపు ఖరారైంది. ఇప్పటికే దీనికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తయినట్టు తెలుస్తోంది. పద్మారావు గతంలో ఎక్పైజ్ శాఖ మంత్రిగా పని చేశారు. ఈ సారి కూడా మంత్రి పదవి దక్కుతుందని ఆశించినా ఆయనకు స్థానం దక్కలేదు. పద్మారావు సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

డిప్యూటి స్పీకర్  ను ఏకగ్రీవం చేసేందుకు ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీ విపక్షాల మద్దతు కోరింది. దీనికి బిజెపి, ఎంఐఎం మద్దతు పలికాయి. కాంగ్రెస్ కూడా సూత్రపాయంగా అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది. పద్మారావు నామినేషన్ దాఖలు చేసిన తర్వాత అధికారికంగా ఆయన ఎంపికను సోమవారం ప్రకటించే అవకాశం ఉంది.