ఎల్ఎల్ఎం థర్డ్ సెమిస్టర్ పరీక్షలు రాసిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే

ఆయన టిఆర్ఎస్ ఎమ్మెల్యే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండో సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితేనేం చదువును మాత్రం వదిలిపెట్టలేదు. ఆయనే ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఆయన ప్రస్తుతం ఎల్ ఎల్ ఎం కోర్సును దూర విద్య ద్వారా చేస్తున్నారు. ఇటీవల ఫస్టియర్ కంప్లిట్ చేసిన ఆయన సెకండియర్ చదువుతున్నారు. 

పరీక్ష రాస్తున్న జీవన్ రెడ్డి

హన్మకొండలోని ఆదర్శ లా కాలేజిలో ఎల్ ఎల్ ఎం మూడో సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. దీంతో ఆయన పరీక్ష రాసేందుకు హాజరయ్యారు. ఎమ్మెల్యే పరీక్ష రాయడంతో అక్కడికి వచ్చిన వారంతా ఆశ్చర్యంగా చూడగా ఎంత అధికార దర్పం ఉన్నా చదువు విలువ చదువుదే అని మరికొంత మంది చర్చించుకున్నారు.