ఆలేరు తాజా మాజీ ఎమ్మెల్యే, టిఆర్ఎస్ అభ్యర్ది గొంగిడి సునీత భర్త మహేందర్ రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. ఏం చేశావు, మళ్లీ ఏం ముఖం పెట్టుకొని ఓట్లడుగుతున్నావని నిలదీసినందుకు ఓ కార్యకర్తను మహేందర్ రెడ్డి అనుచరులు చితకబాదారు. దీనికి మహేందర్ రెడ్డి మద్దతు పలకడంతో పెద్ద వివాదంగా మారింది. అసలు వివరాలేంటంటే..

యాదగిరిగుట్ట మండలం గౌరాయ పల్లిలో మహేందర్ రెడ్డి కుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వచ్చిన గుత్త కృష్ణారెడ్డి అనే యువకుడు ప్రాజెక్టులు, ఇతర పనులపై నిలదీశాడు. దీంతో మహేందర్ రెడ్డి కను సైగలతో గ్రామానికి చెందిన బైరి అయిలయ్య, యాదగిరి, భాస్కర్, బాలు ఇతర టిఆర్ఎస్ వాళ్లు కృష్ణారెడ్డిని కొట్టారు. కృష్ణారెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. దీని పై ఎన్నికల సంఘం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కృష్ణారెడ్డి మాట్లాడిన వీడియోలు కింద ఉన్నాయి చూడండి.


