Thamma Reddy: పాడుతా తీయగా కార్యక్రమం పై సింగర్ ప్రవస్తి చేసిన వ్యాఖ్యలు ఎలాంటి వివాదాన్ని సృష్టించాయో మనకు తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రవస్తీ ఎలిమినేట్ కావడంతో తాను ఎంతో చక్కగా పాడిన జడ్జిలు మాత్రం తన పట్ల పక్షపాతం చూపిస్తూ నన్ను ఉద్దేశపూర్వకంగానే ఎలిమినేట్ చేశారంటూ ఆరోపణలు చేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ప్రొడక్షన్ టీం గురించి అలాగే కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.
పాడుతా తీయగా కార్యక్రమంలో బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తారని, ఇక్కడ కూడా ఎక్స్పోజ్ చేయాలి అంటూ ప్రవస్తి చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. ముఖ్యంగా సింగర్ సునీత గురించి ఈమె చేసిన వ్యాఖ్యలు పట్ల ఇండస్ట్రీలోని పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ వారి అభిప్రాయాన్ని తెలియజేశారు ఈ క్రమంలోనే డైరెక్టర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సైతం ఈ వివాదం గురించి స్పందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….పాడుతా తీయగా షోలో ఓ జడ్జి రాకపోతే తాను జడ్జిమెంట్ ఇవ్వడానికి వెళ్లానని.. కానీ ఒక కులం వారినే ప్రోత్సహిస్తారు అనేది అబద్ధమని ఇందులో ఏమాత్రం నిజం లేదని తెలిపారు. ఇక సింగర్ సునీత తనని తొక్కేసే ప్రయత్నం చేసిందని ప్రవస్తి తెలిపారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో సునీతకే దిక్కులేదు.ఒకప్పుడు నెలకు 15 పాటలు పాడే సునీత ఇప్పుడు సంవత్సరంలో 10 పాటలు పాడితే గొప్ప అన్నారు. అలాంటి సునీతకు నిన్ను తొక్కేస్తే ఏమొస్తుందని భరద్వాజ్ ప్రశ్నించారు.
ఒకవేళ సునీత అంత పెద్ద స్థాయిలో ఉంటే మ్యూజిక్ డైరెక్టర్లకు ఫోన్ చేసి తనకు పాడే అవకాశం ఇవ్వండి అని అడుగుతుందే కానీ ప్రవస్తి పాడే అవకాశం ఇవ్వకండి అని ఎందుకు చెప్తుందని ప్రశ్నించారు. ఇక పొట్టి దుస్తుల విషయానికొస్తే.. అసలు తాను జడ్జిగా వెళ్లినప్పుడు చంకలు కనిపించేలా దుస్తులు వేసినా తాను ఒప్పుకునేవాడిని కాదని.. పాడుతా తీయగాలో అలాంటి దుస్తులు వేసుకునే వారు కూడా లేరంటూ ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ్ పాడుతా తీయగా వివాదం గురించి స్పందిస్తూ చేసిన ఈ కామెంట్స్ సంచలనగా మారాయి.