గౌరవనీయ శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి,
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు ,
టీడీపీ జాతీయ అధ్యక్షులు.
విషయం : నందీశ్వర్ గౌడ్ గారి పేరును పటాన్చెరు టికెట్ ఆశావాహుల జాబితాలో ప్రతిపాదించడం చాలా బాధాకరం.
ఆర్యా!
నిజామోద్దీన్ బాబా(25)(మెంబర్షిప్ ఐడి : 03868105) అను నేను నాకు ఊహ తెలిసినప్పటి నుండి 10వ తరగతి పూర్తి చేసుకోగానె మీ విజన్ 20-20కి ఆకర్షితుడినై 2008లో తెలుగు దేశం పార్టీలో చేరాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ మారాకుండ అనేక పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నాను. మీరు చేసిన వస్తున్న మీకోసం పాదయాత్రలో ఉమ్మడి మెదక్ జిల్లా వాలంటీర్ గా పని చేసాను, తెలుగు దేశం పార్టీ ఆదేశానుసారంగా ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నాను.

పటాన్చెరు నియోజకవర్గం 2009,2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపు కొరకు ఎంతగానో కష్టాలు పడ్డాము కానీ దురదృష్టవశాత్తు ఆ రెండు ఎన్నికల్లో టీడీపీ రెండవ స్థానంలో నిలిచింది. ఆ తరువాత నాయకులు పార్టీని విడిచిన 2 దశాబ్దాలుగా పార్టీలో కొనసాగుతున్న పటాన్చెరు జెడ్పీటీసీ, రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గ ఇంచార్జ్ గడీల శ్రీకాంత్ గౌడ్ గారి వెంబట ఉండి పార్టీ బలోపేతనానికి ఎంతో కృషి చేశాము, ఇప్పుడు పార్టీ పునర్వైభగన్ని సాదించిందని గర్వంగా చెప్పుకుంటూ ఈ ఎన్నికల్లో పటాన్చెరు నియోజకవర్గంలో కచ్చితంగా టీడీపీ గెలుపు ఖాయంగా చెప్పగలము.
ఈ నేపథ్యంలో పటాన్చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ గారు 20రోజుల క్రితం తెలుగు దేశం పార్టీలో చేరారు, చేరినందుకు సంతోషంగానే ఉన్నా, వారిని టికెట్ ఆశవాహుల జాబితాలో చేర్చడం చాలా బాధను కలిగించింది.
ఎందుకనగా 2009 ఎన్నికల్లో వారు టీడీపీ అభ్యర్థిపై కేవలం 1247 ఓట్ల తేడాతో గెలిచారు, 2014 ఎన్నికల్లో 18శాతం ఓట్లు పొంది మూడవ స్థానంలో నిలిచారు. 2009,2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి టీడీపీ కార్యకర్తలను అనేక ఇబ్బందులకు గురి చేసారు . ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత వారు, వారి తనయులు మాపై కక్ష సాధింపు చర్యలు చేస్తూ దాడులు, దౌర్జన్యలకు పాల్పడ్డారు. వారందరిపై క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి.

ఇదే కాకుండా ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదు, నియోజకవర్గం లోని అన్ని వర్గాలలో తీవ్ర వ్యతిరేకత రావడంతో 2014 ఎన్నికల్లో మూడవ స్థానంలో నిలిచారు. 2014 ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీనీ వీడి నియోజకవర్గాన్ని వీడి హైదరాబాద్ లో స్ధిరపడ్డారు. గత ఏడాది క్రితం బీజేపీలో చేరి నియోజకవర్గం లోకి అడుగు పెట్టారు. దానిని వ్యతిరేకిస్తూ నియోజకవర్గం లోని చాలా మంది బీజేపీ సీనియర్ నేతలు వేరే పార్టీలో చేరిపోయారు. మిగిలిన బీజేపీ నాయకులలో అంతర్గత విభేదాలు సృష్టించి బీజేపీకి నియోజకవర్గంలో నామారూపం లేకుండా చేసి ఆ పార్టీకి రాజీనామా చేసారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావడంతో తిరిగి కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నాలు చేసినా వీరి స్వభావం తెలిసి కాంగ్రెస్ నేతలు చేర్పించుకోలేదు. దాని తరువాత గట్టి ఓటు బ్యాంకు ఉన్న టీడీపీలో చేరారు. ఇప్పుడు తనకే టికెట్ అని, తన వియ్యంకుడు హామీ ఇచ్చారని నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. ఈ విషయం నియోజకవర్గం టీడీపీ నాయకులని ఎంతో చింతిస్తుంది. గట్టి ఓటు బ్యాంకు గల టీడీపీ టిక్కెట్ నందీశ్వర్ గౌడ్ గారికి ఇస్తే ప్రజలలో టీడీపీ పై వ్యతిరేకత వచ్చే విధంగా కన్పిస్తుంది. ఆదే విధంగా ఇతని స్వభావం ముందు నుంచే తెలిసిన కాంగ్రెస్ నేతలు మహాకూటమి టికెట్ ఈయనకు ఇస్తే సపోర్టు చేయడానికి సిద్ధంగా లేరు, నియోజకవర్గం లోని అన్ని మండలాల టీడీపీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు.
మీరు ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని కష్ట కాలంలో టీడీపీకి అండగా నిలిచి, జెడ్పీటీసీగా గెలిచిన తర్వాత టీఆర్ఎస్ నేతలు రాజకీయంగా,ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందులు గురి చేసిన పార్టీ మారాకుండ నియోజకవర్గం లోని టీడీపీకీ అన్ని తానై ముందుండి నడిపిన సీనియర్ నేత, రాష్ట్ర కార్యదర్శి, పటాన్చెరు జెడ్పీటీసీ, నియోజకవర్గ ఇంచార్జ్ గడీల శ్రీకాంత్ గౌడ్ గారిని టికెట్ ఇచ్చినచొ అటు కాంగ్రెస్ ఇటు టీడీపీ నేతలు అందరూ కలసి కట్టుగా కృషి చేసి పటాన్ చెరువు అసెంబ్లీ స్థానన్ని మీకు బహుమానంగా ఇస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము.
మా ఈ బాధను అర్థం చేసుకుని, మాకు న్యాయం చేకురుస్తారని నమ్ముతు ముందుగానే ధన్యవాదాలు తెలుపుతున్నాను.
ఇట్లు

యండి. నిజామోద్దీన్ బాబా
TSNV తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి.
పటాన్చెరు నియోజకవర్గం.
