జాతీయ పార్టీల నేతలు జాతీయ నేతల్లాగానే మాట్లాడుతారు.. ప్రాంతీయ పార్టీల నేతల్లా సొల్లు మాటలు ఉండవు.
సోనియాగాంధీ కేవలం తెలంగాణ కు పరిమితమైన నాయకురాలు కాదు. రాజకీయం కూడా ఇక్కడికి పరిమితం కాదు.. తెలంగాణ ఇచ్చి ఆంధ్రను విడగొట్టిందన్న కోపం ఆంధ్ర ప్రాంత ప్రజలకు ఉంటుంది. ఈ సభలో మేమే తెలంగాణ ఇచ్చాము, అభివృద్ధి జరిగుతుందని ఇచ్చాము అని ఓన్ చేసుకోవాల్సిన పరిస్థితి.. సో ఆంధ్రా ప్రజలకు ఇప్పుడు కావాల్సింది స్పెషల్ ప్యాకేజ్.. ఆంధ్రా లో కూడా మరో మూణ్ణెళ్లలో ఫైట్ స్టార్ట్ అవబోతోంది.. పెద్ద గ్యాప్ లేదు.. చంద్రబాబు, కాంగ్రెస్ దోస్తిని ఆంధ్రా ప్రాంత ప్రజలు ఆదరించాలి. అంటే ఇప్పటి నుంచే ఆ వ్యతిరేకత పోగొట్టుకోవాలి, అప్పుడే చంద్రబాబు తెలంగాణ లో ప్రచారం చేయడం ఈజీ గా ఉంటుంది.
కామన్ మినిమం ప్రోగ్రామ్ లో ప్రాజెక్టు ల గురించి, నీళ్లు, నిధులు , నియామకాల గురించి ప్రస్తావించారు, మేనిఫెస్టోలో ఉన్నాయి కాబట్టి ఉపన్యాసం లో పెద్దగా చెప్పాల్సిన పని లేదు.. టిఆర్ ఎస్ నాయకులు కూకట్పల్లి లో గెలవడం కోసం ఎన్ని వేషాలు వేసినా తప్పులేదు, మీ కాలి ముళ్ళు మా పళ్ళతో పీకుతా అన్నా తప్పులేదు.. ఆంధ్రా కు పేకేజీ ఇచ్చేది తెలంగాణ సొమ్ముతో కాదు.. ఆంధ్రాకు స్పెషల్ ప్యాకేజీ కావాలని ఎంపీ కవిత కూడా అడిగింది. ప్రత్యేక ప్యాకేజి కి ఆంధ్రా అర్హమే అని కెసియార్ కూడా అన్నాడు ఫెడరల్ ఫ్రంట్ కోసం.. మరి ఇప్పుడు జాతీయ నాయకురాలు సోనియాను తప్పు పట్టడం ఎందుకు? వంగలేక మంగళవారం అన్నాడట ఒకడు.
తెలంగాణ మీరు తెచ్చింది కాదు కాంగ్రెస్ ఇచ్చింది.. కాంగ్రెస్ ఇచ్చే ధైర్యం చేయకుంటే బిజెపి ఈ ఐదేళ్లు నాన బెట్టేది.. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అనే నినాదం, రామమందిర నిర్మాణం లా పెండింగులో ఉండేది.. జయశంకర్ ని, కోదండరాం ని మరిచి, ఉద్యమ పార్టీ ని రాజకీయ పార్టీగా మార్చి, దానం, తీగల, తుమ్మల వంటి తెలంగాణ వ్యతిరేక శక్తులను చేరదీసినపుడే విశ్వసనీయత పోయింది.. రేపు ఫెడరల్ ఫ్రంట్ కోసం చంద్రబాబు ను కలుపుకోడని గ్యారెంటీ ఏంటి.. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ పంచన చేరే అవకాశం కూడలేకపోలేదు.. ఇప్పుడు కాంగ్రెస్ గాలి వీస్తోంది, బీజేపీకి గడ్డుకాలం ఉంది.
తెలంగాణ లో అధికారం పోతే కాంగ్రెసుతో జతకట్టి కేంద్ర మంత్రి పదవులకు ఆరాట పడడు అని గ్యారెంటీ ఇవ్వగలరా. ప్రజాస్వామ్యములో ఏదైనా సాధ్యమే. అందుకే ధేర్ ఈజ్ క్రోకడయిల్ ఫెస్టివల్.. సోనియాను తప్పు పట్టకండి.. మీ తప్పులు ఒప్పుకొని, ప్రచారం చేసుకోండి.. తప్పు చేశాము, హామీలను విస్మరించాం, ఈసారి అవకాశం ఇస్తే నెరవేరుస్తాము అని అడగండి. ఇప్పటికే టిఆర్ ఎస్ అభ్యర్థులను వూళ్ళల్లో తరుముతున్నారు. తన్నుతున్నారు. చరిత్రలో ఎక్కడా లేని పరాభవం ఉద్యమ రాజకీయ పార్టీది. అందుకే కాస్త సంయమనం పాటించండి. ధూ నీ బతుకు చెడా.. అన్న ఒక్క మాటకు నెటిజన్లు ఎంత వ్యతిరేక త వ్యక్తం చేశారు. తెలంగాణ సాధనలోనే విమర్శలు, బూతులూ నడిచాయి. సోనియాను బజారుకు ఈడుస్తా అన్నా విన్నారు. ఇప్పుడు మాట తూలితే గుంజి కొడతారు. ఓటమి భయంతో నోరుజారి ఉన్న అవకాశం వదులుకోవద్దు.. సంయమనం పాటించి ఓట్లు అడగండి..
-అయితగాని జనార్దన్, సీనియర్ జర్నలిస్ట్
