కేసీఆర్ శుక్రవారం వనపర్తి ఆశీర్వాద సభలో లోకల్ లీడర్ రేవంత్ రెడ్డి పై ఘాటుగా మాట్లాడారు. రేవంత్ పేరు ఉచ్చరించకుండానే రేవంత్ ను తిట్టిపారేశారు. బుడ్డర్ ఖాన్ గాడు అంటూ ఘోరంగా తిట్టారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ దొరకలేదా అని మాట్లాడారు.
కేసీఆర్ మాటిమాటికి మూడోకన్ను తెరిస్తే మీరుండరు అని మాట్లాడుతుండు… అయ్యా స్వామి దా… మూడో కన్ను తెరువు, మూడు పెగ్గులు ఎక్కువ గుద్దు… ఏమైతదో చూద్దాం… దా… అయ్యా స్వామి నీవు మూడో కన్ను ఎప్పుడు తెరుస్తావో చెప్పు… మేమొచ్చి నీ ముందుకు వచ్చి కూసుంటాం. మేమేమైతామో చూస్తాం… చేతగాక మాటలు నేర్చుకోని ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నావ్ అని రేవంత్ కేసీఆర్ ను విమర్శించారు. దింపుడు కల్లం ఆశ ఉన్నట్టు పదవి మీద మళ్ల గట్ట ఆశ పెట్టుకున్నారు.
ప్రభుత్వం రాజకీయ కక్ష్యతోనే తన పై ఐటి దాడులు చేయించిందని , కేసీఆర్ సైగ లేనిదే అధికారులు వచ్చారా అని హెచ్ ఎంటివికి ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి అన్నారు.
కేసీఆర్ రేవంత్ ను తిట్టిన భాష పై రేవంత్ స్పందించారు. ఎవరైనా సరే మనం చేసే పనుల బట్టే మనకు విలువిస్తరు. కేసీఆర్ నాటి కాంగ్రెస్ మంత్రులను అనలేదా. దద్దమ్మ, సన్నాసిలు అంటే తప్పులేదా. ఇది నాయకులకు ఆయన నేర్పిన భాషే కదా. తాము కూడా శాసనసభ్యులం, ఆయన గౌరవించిండా అని రేవంత్ ప్రశ్నించిర్రు. చింతమడక చీటర్ర్ అన్నా, కచరా అన్నా అందులో తనకు తప్పు కనిపించలేదన్నారు.
కేసీఆర్ మాట్లాడుతున్న భాష ఏమైనా బాగుందా… దద్దమ్మలు, సన్నాసలు, వెధవలు, ఆడంగులు, చేతకానీవాళ్లు, సవటలు అని కేసీఆర్ మాట్లాడలేదా అని రేవంతన్నారు. ఆయన కొడుకు కేటిఆర్ తానే తోపు అన్నట్టుగా కనీస గౌరవం లేకుండా మాట్లాడటం లేదా… కాంగ్రెస్ సీనియర్ నేతలు కీలకంగా ఉన్నప్పుడు కనీసం లాగు తొడగనోడు ఈ విధంగా మాట్లాడుతడా… ఇదే నా పద్దతి… ఇదే నా సంస్కారం అని రేవంత్ కేసీఆర్ ను నిలదీశారు. కేసీఆర్ ను తిట్టిన తిట్లలో తనకు ఎప్పుడు కూడా తప్పనిపించలేదన్నారు.
తన పై ఐటి దాడులు ప్రభుత్వం ఇచ్చిన తప్పుడు సమాచారంతో జరిగాయని అధికారులకు అర్ధమయ్యింది. కావాలని రాజకీయ కక్ష్యతో చేశారు. నా ఇంట్లో దొరికిన పత్రాలను చూసి అధికారులు షాక్ కు గురయ్యారు. వేల కోట్లు ఎలా వచ్చినయి అని కొందరు ప్రశ్నిస్తున్నారు. నా దగ్గర కోట్లు ఉన్నయని వారు అనుకుంటుర్రు. నాకు ఓట్లు ఉన్నయని తాను అనుకుంటున్నానని రేవంత్ రెడ్డి అన్నారు. తనకు కోట్లు లేవు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు రాసుకుంటుర్రు.
నిజంగానే తన దగ్గర వేలకోట్లు ఉంటే ప్రభుత్వమే వారి దగ్గర ఉంది కదా…. విచారణ చేయండి. మరి ఎందుకు అలా చేయడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మోడీ ఆడిస్తుంటే ఇక్కడ కేసీఆర్ ఆడుతున్నారని రేవంత్ విమర్శించారు. ఐటి రైడ్స్ వీరంతా అనుకొని చేయించిన దాడులు… కుట్ర పన్ని తన పైనా దాడులు చేయించారు.
తనకు ఆస్తులు తాత ముత్తాతల కాలం నుంచి ఉన్నాయి. తన అయ్య పోలీస్ పటేల్, తన తాత పోలీస్ పటేల్ తమకు 2500 ఎకరాల భూములున్నాయి. పాసుపోర్ట్ దందాలు చేసుకునే బ్రోకర్ ఏజంట్ కు ఛానల్, పేపర్, కోట్ల రూపాయల ఆస్తులు వచ్చినప్పుడు తనకు తాతల కాలం నుంచే కోట్ల ఆస్తులున్నాయి తనకు ఉండయా… అని రేవంత్ కేసీఆర్ ను ప్రశ్నించారు. కొడుకు, అల్లుడు, బిడ్డ, సడ్డకుని కొడుకు నేతలు కాగా తాను నేతను కాలేనా అని అన్నారు.
కేసీఆర్ రాష్ట్రంలో రాక్షస పాలన . కులాల ప్రాతిపదికన తీసుకొచ్చి పరిపాలిస్తున్నాడు ఈ దొర. ప్రజల జీవన విధానాన్ని విధ్వంసం చేసి, ప్రజలను బానిసలుగా చూస్తున్నాడు. ఎన్నికల ప్రచారాన్ని చేయకుండా అడ్డుకునేందుకు కావాలనే ఎన్నికల వేళ ఐటి దాడులు జరిపించారు. కేసీఆర్ కన్నుసైగ లేనిదే ఢిల్లి నుంచి అధికారులొచ్చిర్రా… అని రేవంత్ నిలదీశారు.
సచివాలయంలో హిమాన్షు దోస్తులను ఏసుకొచ్చి గొటిలాట ఆడి పోయిండు. సన్నబియ్యం హాస్టళ్ల పెడితే సీఎం మనవడితో పోల్చాల్సిన అవసరమేముంది. భద్రాద్రి రామునికి తలంబ్రాలు కేసీఆర్ తన మనవడితో ఇప్పించుడు. అది ఎక్కడి న్యాయం. హారీష్ రావుకు, కవితకు ఇద్దరిద్దరు పిల్లలు. వారి గురించి ప్రస్తామించినామా, ఆ పిల్లలు పిల్లలేకుర్రు. హిమాన్షు ను దగ్గరుండి కేసీఆర్ చెడగొడుతున్నారు.
తెలంగాణలో టిడిపితో పొత్తు పెట్టుకుంటే ఈయనకెందుకు మంట. అన్నింటికి అమరావతికి పోతరు అని మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ బిడ్డ సీఎం అయితడు. చంద్రబాబు పార్టీకి 10-15 సీట్లు ఇస్తాంటుర్రు. దానితోటి చంద్రబాబు సీఎం అయితాడా.. అమరావతికి ఎందుకు పోతం. రాజకీయంగా వాడుకోవడం కోసం చంద్రబాబు పై విమర్శిస్తున్నారు తప్ప ఇంకేం లేదని రేవంత్ అన్నారు.
