ఓ వైపు నల్లగొండ జిల్లాలో సీఎం కేసీఆర్ సభ నడుస్తుంటే అదే సమయానికి మహబూబ్ నగర్ జిల్లా నారాయణ పేటలో కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమం జరిగింది. ఆ సభకు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రేవంత్ రెడ్డి రాకతో సభకు జనం కిక్కిరిసి పోయారు. రోడ్లన్నీ జనసంద్రమయ్యాయి. బిల్డింగ్ లు ఎక్కి మరీ సభను జనం వీక్షించారు. నల్లగొండలో కేసీఆర్ సభకు హాజరుకానీ జనం రేవంత్ సభకు హాజరయ్యారని కాంగ్రెస్ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు. రేవంత్ సభకు హాజరైన జనం వీడియో కింద ఉంది చూడండి.
దొర, దొంగ కేసీఆర్ చెప్తున్న మాటలన్నీ కూడా ఒట్టిమాటలేనని విమర్శించారు. ఈ చింతమడక చీటర్ చెప్పుతున్న మాటలను ప్రజలంతా శ్రద్దగా వినాలే ఆ చీటర్ ను సభలల్లనే విన్న వెంటనే నిలదీయాలని రేవంత్ జనాలకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన దొంగ కేసీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పరిపాలించడం చేతకాక ఎలక్షన్ లకు దెక్కపోయినోడు.. మళ్లేం పరిపాలిస్తడని విమర్శించారు. తెలంగాణలోని యావత్తు ప్రపంచం ఆలోచించాలే ఎవరి పరిపాలన ఎలా సాగిందో తెలుసుకొని తెలివితోటి ఓట్లేయాలన్నారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాన్నడు, డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తాన్నడు, కేజీ టూ పీజీ విద్యను అందిస్తాన్నడు. అన్ని గాలి మాటలు చెప్పి కోతలు కోసిండు తప్పా ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు.
ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఆగం పట్టిస్తున్నాడని, ఈ దొంగ పాసుపోర్టుల బేరం చేసుకునే దొంగ కేసీఆర్ అవాకులు చవాకులు పేలుతున్నడు. అసలు కేసీఆర్ ది నోరేనా అని రేవంత్ ప్రశ్నించాడు. అదే నోటితోటి చేస్తా అని చెప్పి ఇవాళ చేయకుండా నోర్ముసుకున్నాడని రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ దొర కాలు మీద కాలేసుకొని చేతిలో సిగరెట్టు పట్టుకొని తాగుకుంటా కూర్చున్నాడని ఈయన ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చిండా అని రేవంత్ విమర్శించారు.
1200 వందల మందిని బలి తీసుకున్న రాక్షసుడు కేసీఆర్ అని విమర్శించారు. తెలంగాణ తెచ్చింది తనేనని గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఒక్కడన్న కేసీఆర్ కుటుంబంల తెలంగాణ కోసం సచ్చిడా అని రేవంత్ ప్రశ్నించారు. ఉస్మానియాల కాలు పెట్టె దమ్ము కేసీఆర్ కు లేదన్నారు. నిరుద్యోగులు రోడ్ల వెంట ఉద్యోగాలు లేక తిరుగుతున్నాని లక్ష ఉద్యోగాలు వేస్తా అని చెప్పి 32 వేల ఉద్యోగాలు మాత్రమే ఫిల్ చేసిన చీటర్ కేసీఆర్ అని రేవంత్ ఫైర్ అయ్యారు. రేవంత్ స్పీచ్ సాగుతున్నంత సేపు జనాలు ఉత్సాహం చూపారని పలువురు నేతలు చర్చించుకున్నారు.

