కేసీఆర్ ను తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయి : కోమటిరెడ్డి

తెలంగాణలో కేసీఆర్ కుటుంబాన్ని తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయని కాంగ్రెస్ నేత కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కేసీఆర్ రాక్షస పాలన చేశారని విమర్శించారు. కేసీఆర్ కు ప్రజలకు ఉపయోగపడే పథకాలు చేపట్టడానికి చేతులు రాలేదని, నిధులు కూడా విడుదల చేయలేదని ఎద్దేవా చేశారు.

ప్రజలకు ఉపయోగపడే పథకాలు చేస్తే కమీషన్లు రావని వాటిని పక్కకు పెట్టారన్నారు. మిషన్ కాకతీయను కమీషన్ కాకతీయ చేశారన్నారు. కేసీఆర్ ప్రగతి భవన్ ల పండి ఎమ్మెల్యేలకు ఎంత పంచాలని ఆలోచిస్తున్నారన్నారు. ఇప్పటికే రెండు కోట్లు పంచి ఇప్పుడు మరో 5 కోట్లు పంచేందుకు కేసీఆర్ ఫాంహౌజ్ ల ప్లాన్ చేస్తున్నారన్నారు.

డిసెంబర్ 12న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆ రోజే ప్రజారంజక పాలనకు శ్రీకారం చుడుతామన్నారు. అన్ని వర్గాలకు వచ్చే 5 ఏళ్లలో బంగారు భవిష్యత్తును అందిస్తామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.