బిజపి నేత లక్ష్మణ్ ఇచ్చిన హామీ పై సీఎం కేసీఆర్ ఓ కథ చెప్పారు. హైదరాబాద్ లో కిరాయికి ఉన్న వాళ్లకు నెలకు రూ.5000 కిరాయి ఇస్తాని చెప్పిండు ఆయన కథ ఏంట ఉందంటే అని చెప్పి సీఎం కేసీఆర్ ఓ కథ చెప్పిర్రు. ఈ కథను తనకు దేశపతి శ్రీనివాస్ చెప్పాడని కేసీఆర్ తన ప్రసంగంలో చెప్పారు. ఆ కథ కేసీఆర్ మాటల్లోనే వినండి.
“ఒక మేరాయిన బట్టలు కుడుతంటే సూది కింద పడ్డది. సూది దేలాడితే ఎంతకు దొరకలే. దీంతో ఆ మేరాయిన దేవుడా కంఠేశ్వర స్వామి సూది దొరికించయ్యా… నీకు కిలో చక్కెర పెడుతా అని మొక్కిండు. ఇగ ఈ మాట విన్న ఆ ఇంటామే ఇంట్ల నుంచి వచ్చి ఏందయ్యా… పది పైసల సూదికి కిలో చక్కెర పెడుతాంటున్నావు అని అడిగింది. అప్పుడు ఆ భర్త ఏమంటడంటే… నీ పిచ్చిదానా…. సూది దొరికినాక ఎగనామం పెడుతం, చక్కెర పెడుతామానే అని చెప్పిండు. ఇగో ఇప్పుడు గీ బీజేపి వాళ్ల కథ గిట్టుంది” అని సీఎం కేసీఆర్ కథ చెప్పిండు. కిరాయి కడుతడంటా కిరాయి, చెప్పేటోనికి లేకున్నా వినేటోళ్లం మనకు ఇజ్జత్ ఉండొద్దా అని కేసీఆర్ ప్రజలను ప్రశ్నించారు.
