ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ భేటిలో చర్చకొచ్చిన అంశాలివే

సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు, విభజన అంశాల పై ఆయన చర్చించారు. వీటితో పాటు సీఎం కేసీఆర్ మోదీతో 16 అంశాల పై చర్చించారు. అవి ఏంటంటే

* సెక్రటేరియట్, రహదారి నిర్మాణ పనుల కోసం బైసన్ పోలో గ్రౌండ్ భూముల బదిలీ
* కరీంనగర్‌లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్ ఐటీ)ఏర్పాటు అంశం 
* హైదరాబాద్‌లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) ఏర్పాటు 
* కొత్త జిల్లాల్లో 21 జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటు
* హైదరాబాద్‌లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ (ఐఐఎస్‌ఈఆర్) 
* ఆదిలాబాద్‌లో సిమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పునరుద్దరణ 
* నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మానుఫాక్చరింగ్ జోన్ (నిమ్జ్)-జహీరాబాద్ కోసం నిధుల విడుదల
* వరంగల్‌లో కాకతీయ మెగాటెక్స్‌టైల్ పార్క్ అభివృద్ధి కోసం రూ.1000 కోట్లు కేంద్రం నిధుల విడుదల
* కృష్ణా జలాల వివాద పరిష్కారానికి వినతి 
* కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా
* ఏపీ పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన 
* ప్రతిపాదిత రైల్వే ప్రాజెక్టుల పనుల పూర్తి అంశం
* ఎస్సీ వర్గీకరణ బిల్లు 
* వరంగల్‌లో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు
* పునర్విభజన చట్టం ప్రకారం వెనుకబడిన ప్రాంతాల కోసం రూ.450 కోట్లు గ్రాంట్స్ నిధులు విడుదల 
* ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ప్రతిపాదన