Y.S.Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికలలో భాగంగా కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అవుతూ ఘోర ఓటమి ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇలా గతంలో సింగిల్ గా పోటీ చేసి 151 స్థానాలలో విజయం సాధించిన జగన్ ఎన్నో సంక్షేమ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినప్పటికీ గత ఎన్నికలలో కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యారు.
ఇలా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లు రావడానికి గల కారణం ఏంటనే విషయంపై జగన్ క్షుణ్ణంగా పరిశీలనలు చేపడుతూ ఎక్కడ తప్పు జరిగిందని గుర్తిస్తూ పార్టీని ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈయన సరికొత్త నిర్ణయాలను తీసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా జగన్ కూటమి పార్టీలకు ఊహించని షాక్ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది.
రేపటి నుంచి వరుసగా రెండు రోజుల పాటుగా పీఏసీ సభ్యులు, ప్రాంతీయ సమ న్వయ కర్తలతో జగన్ వరుసగా సమావేశాలను నిర్వహించబోతున్నారు. ఇదే సమయంలో జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశాల్లో తన నిర్ణయం అమలు దిశగా కార్యాచరణ ఖరారు చేయనున్నారు. చాలా కాలంగా పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ చేపట్టాలని సీనియర్లు సూచిస్తున్నారు. ప్రతీ ఏటా పార్టీ ప్లీనరీ.. సభ్యత్వ నమోదు కొనసాగించాలని అప్పట్లోనే ప్రతిపాదన వచ్చింది.
అధికారంలో ఉన్న సమయంలోనూ పార్టీ సభ్యత్వం పైన జగన్ నిర్ణయం తీసుకోలేదు. ఇతర పార్టీల్లో సభ్యత్వ నమోదుతో పాటుగా సభ్యత్వం తీసుకున్న వారికి భీమా సదుపాయాన్ని కల్పిస్తున్నారు. కానీ వైసీపీలో మాత్రం ఇలాంటి సదుపాయాలు ఏవి లేవు అయితే ఇకపై సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి బీమా సదుపాయాన్ని కల్పించాలని నిర్ణయాన్ని జగన్ తీసుకున్నారు. అయితే ఇతర పార్టీలు ఇచ్చే బీమా కంటే కూడా ఎక్కువగా ఇవ్వాలని నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే ఎంత మొత్తంలో భీమా అందచేస్తారనే విషయాన్ని రేపు జరగబోయే సమావేశంలో వెల్లడించనున్నారు.
మే లో కడప కేంద్రంగా టీడీపీ మహానాడు నిర్వహిస్తుండటంతో.. గోదావరి జిల్లాల్లో ప్లీనరీ నిర్వహణ దిశగా జగన్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో.. జగన్ సైతం ఇక కూటమితో పోరాటానికి సై అనేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. మరి రెండు రోజులపాటు జరగబోయే సమావేశాలలో జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనే విషయంపై ఆసక్తి నెలకొంది.