Trivikram Speech : తెలుగు చలన చిత్ర పరిశ్రమ వద్ద ఉన్నత్స్ర దర్శకుల్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఒకరు. అయితే త్రివిక్రమ్ మన టాలీవుడ్ బిగ్ స్టార్స్ లో కొంతమంది హీరోస్ తో చాలా సాన్నిహిత్యంగా ఉంటారన్న సంగతి తెలిసిందే. మరి వారిలో అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉండే సాన్నిహిత్యం కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఎప్పుడో జల్సా నాటి నుంచి ఇపుడు భీమ్లా నాయక్ వరకు కూడా వీరి స్నేహ ప్రయాణం కొనసాగుతూ వచ్చింది. అయితే ఈ భీమ్లా నాయక్ సినిమా విషయంలో త్రివిక్రమ్ కూడా తన వంతు సహకారం భారీ రెమ్యునరేషన్ తీసుకొని అందించారు. ఈ సినిమాకి యువ దర్శకుడు సాగర్ కే చంద్ర వర్క్ చెయ్యగా తాను మాటలు స్క్రీన్ ప్లే అందించారు.
అయితే ఈ సినిమాలో ప్రతి అంశంలో కూడా తన ప్రమేయం ఉండడంతో ఇన్ డైరెక్ట్ గా తానే సినిమా దర్శకుడు అని ఒక ముద్ర పడిపోయింది. మరి ఇది పక్కన పెడితే నిన్న ఈవెంట్ వరకు వెళ్లిన త్రివిక్రమ్ స్టేజి ఎక్కకుండా కనీసం సినిమా యూనిట్ తో సీట్ లో కూడా కూర్చోకుండా ఉండడం అందరికీ షాకిచ్చింది.
ఇంకా చాలా మంది అయితే త్రివిక్రమ్ స్పీచ్ కోసమే చాలా ఆసక్తిగా ఎదురు చూసారు. కానీ ఊహించని విధంగా త్రివిక్రమ్ మైక్ కాదు కదా స్టేజి పైకి కూడా ఎక్కలేదు. మరి దీనికి రెండు కారణాలు ఉన్నట్టు తెలుస్తుంది. మొదటిది దర్శకుడు సాగర్ విషయంలో కాగా మరొకటి బండ్ల గణేష్ విషయంలో ఏమో అని టాక్ వినిపిస్తుంది.
సాగర్ మొదటి నుంచి హైలైట్ అవ్వట్లేదు అనే మాటా వాస్తవం అందుకే లాస్ట్ లో త్రివిక్రమ్ ఇలా చేసాడని ఓ టాక్ వినిపించగా మరొకటి మొన్న బండ్ల గణేష్ ఆడియో లీక్ కి సంబంధించే త్రివిక్రమ్ మైక్ పట్టుకోలేదు అని మరో మాట వినిపిస్తుంది. మొత్తంగా అయితే ఈ రెండు కారణాల వల్లే త్రివిక్రమ్ స్పీచ్ మిస్సయ్యింది అని ఇండస్ట్రీ వర్గాల్లో బోగట్టా..
