Health Tips:మనిషి ఏ పని చేయాలన్నా ఒక చోటునుండి మరొక చోటికి కదలాలి. ఈ ప్రక్రియకు కాళ్లు దోహదపడతాయి. కానీ ఈ మధ్య కాలంలో చాలా మంది మడమ నొప్పులు, పాదాల నొప్పి తో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య ఒక్కసారి మొదలైతే అంత త్వరగా తగ్గదు. విపరీతమైన శారీరక శ్రమ, ఊబకాయం, ఆర్థరైటిస్, హై హీల్స్ వేసుకోవడం, నరాలు దెబ్బతినడం, కాల్లస్,పాదాల పుండ్లు వంటివి కారణాలుగా చెప్పవచ్చు. ఈ మడమ నొప్పులు ఒకసారి వచ్చాయి అంటే అంత త్వరగా విడిచిపెట్టవు. వీటిని తగ్గించుకోవడానికి వంటింట్లో లభించే పదార్ధాలతో కొన్ని చిట్కాలు ఫాలో అవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి.
* ఆవపిండిని ఎన్నో సమస్యల నివారణ కోసం వినియోగిస్తారు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఒక బకెట్ గోరువెచ్చని నీటిని తీసుకొని అందులో ఒక అర కప్పు ఆవ పిండి వేయాలి. ఈ నీటిలో మీ పాదాలను అరగంట సేపు ఉంచితే పాదాల నొప్పి తగ్గుతుంది.
*వెల్లుల్లిలో ఉన్న ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అందరికీ తెలిసిన విషయమే. వెల్లుల్లి పాదాల నొప్పులు, వాపులను తగ్గిస్తుంది అని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. నాలుగు గ్రాముల వెల్లుల్లిని తీసుకొని వాటిని ఆవనూనెలో బాగా వేయించాలి. ఆ నూనెతో పాదాలకు మర్దన చేయడం వల్ల పాదాలు నొప్పులు తగ్గుతాయి. అంతేకాకుండా రాత్రి పూట పాదాల మీద ఆ నూనెతో మర్దన చేస్తే నిద్ర బాగా పడుతుంది.
*పసుపు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పసుపు లో యాంటీబయాటిక్ గుణాలు ఉంటాయి. పసుపు ఎముకల సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఇవే కాకుండా నొప్పి, వాపులను తగ్గించగల గునం కూడా పసుపు లో ఉంటుంది. తీవ్రమైన పాదాల నొప్పి ఉంటే రోజు 8 గ్రాముల పసుపు ను మీ ఆహారంలో చేర్చడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
*పాదాల నొప్పులను తగ్గించడానికి అల్లం బాగా ఉపయోగపడుతుంది. ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని దాన్ని గ్రైండ్ చేసుకొని అందులో కి రెండు టీ స్పూన్ల నీటిని కలపాలి. ఒక క్లాత్ తీసుకుని ఆ నీటిలో క్లాత్ ముంచి పాదాల నొప్పి ఉన్నచోట పూసి, ఒక పదిహేను నిమిషాలు అలాగే ఉంచాలి. రోజుకి 3 సార్లు ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
*ఒక టీ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ ను తీసుకొని అందులోకి ఒక గ్లాస్ వేడి నీటిని, కొంచెం తేనె తేనె మిక్స్ చేసి తాగితే పాదాల నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే ఒక బకెట్ వేడి నీటిలో టీ స్పూను ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి అందులో పదిహేను నిమిషాల పాటు పాదాలు ఉంచడం వల్ల నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.
