ఉదయం ఓ కప్పు టీ తాగకుండానే రోజు మొదలు పెట్టలేకపోవడం అనేది చాలా మందికి అలవాటు. ఇంట్లో అతిథులు వస్తే వెంటనే టీ పెట్టి ఇచ్చే ఆచారం కూడా అనేక ఇంట్లలో కొనసాగుతుంది. కానీ ఈ అలవాటు ఆరోగ్యానికి ప్రతికూలతలు కలిగిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
టీ తాగడం వల్ల ఎక్కువగా ఎసిడిటీ, కడుపు ఊబకాయం, గ్యాస్ సమస్యలు, నిద్రలేమి, ఆందోళన, డీహైడ్రేషన్ వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తాయి. ముఖ్యంగా కఫీన్ అధికంగా ఉండటంతో శరీరానికి మానసిక ఒత్తిడి, హృద్రోగ సమస్యలకు అవకాశం ఉంటుంది. రుతుజ్ సూచనల ప్రకారం, రోజుకు రెండు కప్పుల టీ తాగడం సురక్షితం. అంతకన్నా ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి మేలు చేయదని అంటున్నారు.
టీ తాగేటప్పుడు మనం అనేక రకమైన స్పైసులు, పాలు, చక్కెరలు కలుపుతూ తాగుతుంటాం. వీటితో పాటు బిస్కెట్లు, సమోసా, పకోడి వంటి ఫ్రైడ్ స్నాక్స్ తీసుకుంటే జీర్ణవ్యవస్థ పాడవడం, కొలెస్ట్రాల్ పెరగడం వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. న్యూట్రిషనిస్ట్ సూచనల ప్రకారం, టీతో కలిసి మఖానా, శనగలు వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్ తీసుకుంటే సమస్యలు తగ్గతాయి.
అంతే కాదు టీ తాగే టైమింగ్స్ చాలా ముఖ్యం. సాయంత్రం 4 గంటల తర్వాత టీ తాగడం నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. అంతేకాదు భోజనం సమయానికి టీ ఎక్కువగా తాగితే శరీరానికి అవసరమైన పోషకాలు సరియైన మోతాదులో అందకపోవచ్చు. అందుకే వైద్యలు సూచనల ప్రకారం.. రోజుకు ఒక్కోసారి.. ఎక్కువగా కాకుండా, కేవలం రెండు కప్పుల వరకు టీ తాగండి. పాలు, చక్కెర తగ్గించి గ్రీన్ టీ తాగడం మరింత ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ అలవాటు పాటించడం ద్వారా, టీని ఆస్వాదించడమే కాకుండా, ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.
సోషల్ మీడియాలో ఈ వార్త ఇప్పుడు వైరల్గా మారుతోంది. నష్టాల గురించి తెలుసుకున్న యువత, రోజుకు టీ తాగే మోతాదును కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. టీ రుచి, ఆరోగ్యం రెండింటినీ సరిగ్గా బ్యాలెన్స్ చేసే ఛాన్స్ ఉంది.
