అప్పుడు “భీమ్లా నాయక్” కి శుభం కార్డ్ పడనుందట.!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మాస్ మసాలా చిత్రం “భీమ్లా నాయక్”. రానా కూడా కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో నిత్య మీనన్ మరియు సంయుక్త మీనన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే ఈ సాలిడ్ మాస్ చిత్రాన్ని చిత్ర యూనిట్ ఎలా అయినా వచ్చే సంక్రాంతికి రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తుండగా సినిమా షూటింగ్ ని కూడా చాలా వేగంగా చేస్తున్నారట.

అయితే ఇక మొత్తం భీమ్లా నాయక్ షూటింగ్ కి శుభం కార్డు ఎప్పుడు పడనుందో తెలుస్తుంది. వచ్చే డిసెంబర్ రెండో వారానికల్లా భీమ్లా నాయక్ షూటింగ్ అంతా పూర్తయ్యిపోతుందని ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం. ఇక తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు వగైరా నడుస్తాయట. మరి ఫైనల్ గా ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా రేపు ఈ సినిమా నుంచి ఇంకో కొత్త సాంగ్ ని రిలీజ్ చెయ్యబోతున్నారు.